హరి కోపం వెనుక..: ఎన్టీఆర్ శత్రువింటికి బాలకృష్ణ!
స్వర్గీయ నందమూరి తారక రామారావును వ్యతిరేకించిన బంధువు ఇంటికి హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ వెళ్లడం చర్చనీయాంశమైంది. సినిమాల్లో, రాజకీయాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నా ఎన్టీఆర్ నిమ్మకూరును మర్చిపోలేదు. గ్రామానికి ఆయన ఎంతో చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అనేక వినూత్న పథకాలను ఆయన తన గ్రామంలో కూడా అమలు చేశారు.
1987 ఆగస్టులో వివిధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రిగా నిమ్మకూరు వచ్చేందుకు ఎన్టీఆర్ పర్యటన ఖరారైన సమయంలో ఆయన తోడల్లుడు నందమూరి చంద్రం కుమారుడు వెంకటరత్నం పార్టీ జెండా దిమ్మెను కూల్చడం ఆయన మనసును కలిచివేసింది. దాంతో ఆయన ఆ గ్రామానికి దూరమయ్యారు. నిమ్మకూరు రానని ఎన్టీఆర్ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. పట్టుదలకు మారు పేరైన ఎన్టీఆర్ కన్నుమూసే వరకూ నిమ్మకూరువైపు కన్నెత్తి చూడలేదు.

ఎన్టీఆర్తో ఆవిష్కరించేందుకు సిద్ధం చేసిన జెండా దిమ్మెను ట్రాక్టర్తో ఢీ కొట్టి పడగొట్టడంతోపాటు పక్కనే ఉన్న ఆస్పత్రి గోడను కూడా వెంకటరత్నం ట్రాక్టర్తో కూలగొట్టాడు. ఈ ఘటన గురించి అధికారులు ముందు రోజు రాత్రి ఎన్టీఆర్కు సమాచారం అందించారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తన బంధువే అయిన వెంకటరత్నం వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందారు. గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా వెంకటరత్నం వ్యవహార శైలి ఆయనను కలచి వేయడంతో గ్రామానికి దూరమయ్యారు.
అయితే, అలాంటి వెంకటరత్నం ఇంటికి ఇప్పుడు బాలకృష్ణ వెళ్లారు. ఇది నందమూరి కుటుంబంలో చర్చకు, కలకలానికి దారి తీసింది. ఇటీవల రాజకీయాల్లోకి రావడంతోపాటు కృష్ణా జిల్లా రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న బాలకృష్ణ.. వెంకటరత్నం ఇంట్లో అడుగు పెట్టారు. వెంకటరత్నం కుమారుడు శివరామకృష్ణ ఇంట్లో బస చేశారు. అంతేకాదు, నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ఠించిన తన తాత ఎన్టీఆర్, నాయనమ్మ బసవ తారకం విగ్రహాల వైపు కూడా బాలకృష్ణ కన్నెత్తి చూడలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ఠించిన కారణంగానే బాలకృష్ణ అటువైపు వెళ్లలేదన్న చర్చ జరుగుతోంది.
15 రోజుల కిందట కూడా మరోసారి ఆయన శివరామకృష్ణ ఇంట్లో బస చేశారు. ఇటీవల తన తల్లి స్వగ్రామమైన కొమరవోలు వచ్చిన బాలకృష్ణ అక్కడ తన మేనల్లుడి ఇంట్లో బస చేశారు. అక్కడి నుంచి నేరుగా నిమ్మకూరు వెళ్లారు. నందమూరి వంశస్తులు కోరడంతో తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసిన బాలకృష్ణ తిరిగి శివరామకృష్ణ ఇంటికి వెళ్లడం గ్రామంతోపాటు ఎన్టీఆర్ కుటుంబంలో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన, అప్పట్లో ఎన్టీఆర్ను వ్యతిరేకించిన వెంకటరత్నం ఇంటికి బాలకృష్ణ వెళ్లడం ఏమిటనేదే ప్రస్తుతం ఆ కుటుంబంలో చర్చ. ఎన్టీఆర్కు నిమ్మకూరులో సొంత ఇల్లు ఉన్నా బాలకృష్ణ ఆ ఇంటి వైపు కూడా వెళ్లలేదు. శివరామకృష్ణ ఇంటికి వెళ్లడంపై బాలకృష్ణ సోదరులకు కొంతమంది గ్రామస్తులు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ వ్యవహారం కృష్ణా జిల్లా టిడిపి నేతల వద్దకు వెళ్లింది. ఆ జిల్లా నాయకులు ఈ వ్యవహారాన్ని పార్టీ అగ్రనేతల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
బాలకృష్ణ, హరికృష్ణ కుటుంబాల మధ్య పెరుగుతున్న అగాధానికి ఈ సంఘటనే ఉదాహరణ అని కొంతమంది టిడిపి నేతలు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారట. జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా పెట్టడమే బాలకృష్ణ గేమ్ప్లాన్లో భాగమని కూడా మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
-
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
జాన్వీ కపూర్ ఇష్టపడే రాయలసీమ స్పెషల్ రెసిపీ.. ఇలా ఈజీగా చేసుకోండి.. -
GAS కష్టాలు.. భోజనం దొరకడం కూడా కష్టమేనా? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications