పతకం గెల్చిన దీపికను కంటతడి పెట్టించారు
ఈ సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను సన్మానించింది. అనంతరం పలువురు విలేకరులో ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం వెంటబడ్డారు. తాను చాలా అలసిపోయి ఉన్నానని, పైగా మరో విమానం అందుకోవాలని ఆమె చెప్పినా మీడియా వినిపించుకోకపోవడంతో నిస్సహాయ స్థితిలో భావోద్వేగానికి లోనైన దీపిక కంటతడి పెట్టారు.
పోలండ్లో జరిగిన ప్రపంచ కప్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో దీపిక నేతృత్వంలోని బొంబ్యాలా దేవి, రిమిల్ బురిలేతో కూడిన భారత త్రయం స్వర్ణం సాధించింది. కాగా మీడియాతో మాట్లాడేందుకు దీపిక కొంత దూరంగా ఉంటారని అంటున్నారు. గతంలో ఓ టోర్నమెంట్ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియానికి వచ్చిన దీపిక కోసం మీడియా గంటల కొద్దీ వేచి చూసింది. చివరికి మీడియాతో మాట్లాడాలని టోర్నీ నిర్వాహకులు సూచించినా మాట్లాడలేదు.
మరోవైపు, స్వర్ణం గెల్చుకొచ్చిన తమకు లభించిన స్వాగతంపై ఆర్చరీ టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్చరీ బృందం పోలండ్ నుంచి మంగళవారం ఉదయం భారత్కు తిరిగొచ్చింది. అయితే వారికి ఆహ్వానం పలికేందుకు ఆర్చరీ సంఘానికి చెందిన ఉన్నతాధికారులెవరూ ఎయిర్ పోర్ట్కు రాలేదు.