రెండోసారి వద్దు, అమెరికా వెళ్లిపోతా: రఘురాం రాజన్
ముంబై: ఆర్బీఐ గవర్నర్గా తాను రెండోసారి బాధ్యతలను చేపట్టలేనని, తనకు ఇష్టమైన బోధనా వృత్తిలోకి వెళ్తానని, యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు.
ఆర్బీఐ గవర్నర్ పదవిని ఆయన రెండోసారి చేపడతారా, అవకాశం వస్తుందా అనే చర్చ గత కొద్ది రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను తాజాగా ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆర్థిక ప్రగతికి తాను ఏం చేశానో చెప్పారు.
నేను తొలుత చెప్పినదాని కంటే మనం ఎక్కువే చేశామని, ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతుల నియామకం విషయంలో బ్యాంక్ బోర్డు బ్యూరో ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి సాయపడ్డామని, విఫలమైన ప్రాజెక్టుల నుంచి బకాయిలు రాబట్టుకోవడానికి బ్యాంకుల కోసం కొత్త అధికారాలిచ్చామన్నారు.

ఆస్తుల నాణ్యత సమీక్ష(ఏక్యూఆర్)ను ప్రవేశపెట్టామని, దీని ద్వారా ఆయా బ్యాంకులు ఆయా సమయాల్లో మొండి బకాయిలను గుర్తించి కేటాయింపులు జరపడానికి వీలైందన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోసం సార్వజనీన చెల్లింపుల పద్ధతిని తీసుకురావడం కోసం సహాయపడ్డామన్నారు.
తన చివరి గమ్యస్థానం అకడమిక్స్ అని, మూడేళ్ల పదవీ కాలం ముగింపు దశకు చేరుకుందని, యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మనం ఏం సాధించామన్నది సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయమన్నారు.
తొలి రోజున నిర్ణయించుకున్న లక్ష్యాల్లో రెండు ఇంకా పూర్తి కావాల్సి ఉందని, ద్రవ్యోల్బణం మన లక్ష్య స్థాయిలోనే ఉందని, అయితే విధానాలను నిర్ణయించే పరపతి విధాన కమిటీ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. సెప్టెంబరు 4, 2016న గడువు ముగుస్తుందని, అయినప్పటికీ నా దేశానికి అవసరమైనపుడు నా సేవలు ఎపుడూ ఉంటాయన్నారు.
తన తర్వాత ఈ బాధ్యతలను స్వీకరించే వ్యక్తి కచ్చితంగా మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళతారని విశ్వాసం ఉందని చెప్పారు. కాగా, రఘురాం రాజన్ ఈ లేఖను సిబ్బందికి రాశారు. రాజన్ నిర్ణయం నేపథ్యంలో బీజేపీ పైన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
రాజన్ తర్వాత..
రఘురాం రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్ పదవి కోసం విజయ్ కేల్కర్, రాకేష్ మోహన్, అశోక్ లాహిరి, ఊర్జిత్ పటేల్, అరుంధతి భటడ్టాచార్య, సుబీర్ గోకర్ణ్, అశోక్ చావ్లా తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications