తెలంగాణ వలె..: బీజేపీని టార్గెట్ చేసిన నటుడు శివాజీ
విజయవాడ: తెలంగాణ కల ఎలా అయితే సాకారమైందో అలాగే ఏపీకి ప్రత్యేక హోదా కూడా సాధ్యమవుతుందని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షులు, నటుడు శివాజీ అన్నారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. హోదా సాధనలో వెనక్కి వెళ్లబోమని స్పష్టం చేశారు. బీజేపీని నమ్ముకుంటే మట్టి, నీళ్లు తప్పా ఏపీకి ఏమీ దక్కదన్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీనే ఏపీకి ఎక్కువ నష్టం చేసిందన్నారు. హోదా కోసం బీజేపీ రాష్ట్ర నాయకులు సాయం చేయాలన్నారు.
విభజన సమయంలో ఏపీకి పదేళ్లు హోదా కావాలని, మేము అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ సీనియర్ నేతని బీజేపీ నేతలు చెంపలు వాయించి, రాష్ట్రానికి తీసుకు వచ్చి, ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పించగలరా అని ప్రశ్నించారు.
శివాజీ
ఏపీలో ప్రత్యేక హోదా అంశం వేడి పుట్టిస్తోంది. రాజకీయ పార్టీలన్ని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుంటే, చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీ లాంటి వాళ్లు హోదా కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
శివాజీ
ప్రత్యేక హోదా విషయంలో నటుడు శివాజీ భారతీయ జనతా పార్టీనే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీయే ఏపీకి ఎక్కువ నష్టం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శివాజీ
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కని, ఎట్టి పరిస్థితుల్లోను దాన్ని సాధిస్తామంటున్నారు. హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ తీరా ఇప్పుడు చేతులెత్తేసిందని, బీజేపీని నమ్ముకుంటే మిగిలేది మట్టి, నీళ్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు.
శివాజీ
తెలుగు వారిని మోసం చేసిన పార్టీ బీజేపీకి ముద్ర పడిపోతుందని మండిపడ్డ శివాజీ, ఏపీకి న్యాయం జరగపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
శివాజీ
ప్రత్యేక హోదా కోటీశ్వరుల కోసం కాదని చెప్పిన శివాజీ, భావి తరాల కోసం, విద్యార్థుల కోసం ప్రత్యేక హోదా తప్పనిసరి అన్నారు.
శివాజీ
పార్టీలకు అతీతంగా ప్రాంతానికి మద్దతు ఇవ్వాల్సిందిగా బీజేపీ నేతలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక అభిప్రాయానికి వస్తే, అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఇందుకోసం రెండు పార్టీలు కలిసి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రయత్నం చేయాలన్నారు.
శివాజీ
ఏపీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అవసరమైతే ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేసైనా సరే హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శివాజీ
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టబోయే ప్రయివేటు మెంబర్ బిల్లుకు పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఓటు వేయాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదని చెప్తున్నవారు.. అలా చెప్పేముందు ఆ అంశాన్ని రాజ్యాగం నుంచి తొలగించాలన్నారు.