అర్ధరాత్రి ఇదేంపని: అభ్యర్థి ఫ్యామిలీ కన్నీరు(పిక్చర్స్)
అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక దాడులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి వెంకటరమణ, ఆయన సతీమణి సుగుణలు మంగళవారం రోదించారు. కుట్రలో భాగంగానే పోలీసులు సోదాలు చేశారని వారు ఆరోపించారు. చిన్నారులకు అన్నం కూడా పెట్టనివ్వలేదని కన్నీటిపర్యంతమయ్యారు.
అర్ధరాత్రి వేళ తమ నివాసంలో సోదాలు నిర్వహించి తమను అవమానించేవిధంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరించారని, తమకు రక్షణ లేకుండా పోయిందని సుగుణా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి తిరుపతి టిడిపి అభ్యర్థి వెంకటరమణ నివాసంలో పోలీసులు, ఐటి శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 4 లక్షల రూపాయలు నగదును గుర్తించి తిరిగి వారికే అప్పగించి వెళ్లారు. అర్ధరాత్రి వేళ మహిళలు, పిల్లలున్న ఇంటిలో ఇలా తనిఖీల పేరుతో తమను ఇబ్బంది పెట్టడంపై తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆమె విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

వెంకటరమణ
తమ ప్రత్యర్థులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో పోలీసులు తమ ఇంటిపై దాడులు చేయడం దారుణమని సుగుణ వెంకటరమణ విమర్శలు గుప్పించారు.

వెంకటరమణ
ఎంతోమంది అభ్యర్థులుండగా తన నివాసంపైనే పోలీసులు, రెవెన్యూ అధికారుల దాడులు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

వెంకటరమణ
పోలీసుల దాడులు చూస్తుంటే ప్రజాస్వామాన్ని అపహాస్యం పాలు చేసినట్లు కనిపిస్తోందన్నారు. వెంకటరమణ సతీమణి సుగుణతో పాటు ఆయన సోదరి శారద మాట్లాడుతూ కొంతమంది ప్రత్యర్థులు కుట్రపన్ని తమను ఇలా ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు.

వెంకటరమణ
ఎన్నికల ముందు భయాందోళనకు గురి చేసేందుకే ఇలాంటి విధానాలను కొనసాగిస్తారన్నారు. ఐటి, రెవెన్యూ అధికారులను ఒక ప్రజాప్రతినిధి పురమాయించారని తమకు తెలుసన్నారు.

వెంకటరమణ
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ప్రజలు ఆదరించి ఆశీస్సులు అందిస్తే అద్భుతంగా సేవలు అందిస్తామన్నారు.

వెంకటరమణ
కోట్లాది రూపాయలు డబ్బులు పట్టుపడుతున్నా, మద్యం ఏరులై పారుతున్నా ఏమాత్రం పట్టించుకోని అధికారులు టిడిపి అభ్యర్థిపైనే దాడికి దిగడం, ఇంటిలో చొరబడి పరుపులు, బీరువాలు వెతకడం తమను అవమానించడమేనన్నారు.

వెంకటరమణ
ఇలాంటి చౌకబారు రాజకీయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారన్నారు. కుట్రదారులకు బుద్ధి చెపుతారన్నారు. వెంకటరమణ మనుమడు శ్రీనివాస్ మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ మాకు నిద్రలేకుండా తనిఖీలు చేశారన్నారు.

వెంకటరమణ
తమ ఇంటిలో ఏమి లేదని తాతయ్య, అమ్మమ్మలు చెపుతున్నా వినిపించుకోకుండా పరుపులు, బీరువాల్లో వెతికారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంకటరమణ
ఈ సమావేశంలో టిడిపి అభ్యర్థి వెంకటరమణ సోదరులు, కుమార్తెలు, పెద్ద అల్లుడు సంజయ్, జయకుమార్, టౌన్బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, సంజయ్, మునిశేఖర్, ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు.

వెంకటరమణ
తమ ప్రత్యర్థులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో పోలీసులు తమ ఇంటిపై దాడులు చేయడం దారుణమని సుగుణ వెంకటరమణ విమర్శలు గుప్పించారు.

వెంకటరమణ
ఎంతోమంది అభ్యర్థులుండగా తన నివాసంపైనే పోలీసులు, రెవెన్యూ అధికారుల దాడులు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

వెంకటరమణ
పోలీసుల దాడులు చూస్తుంటే ప్రజాస్వామాన్ని అపహాస్యం పాలు చేసినట్లు కనిపిస్తోందన్నారు. వెంకటరమణ సతీమణి సుగుణతో పాటు ఆయన సోదరి శారద మాట్లాడుతూ కొంతమంది ప్రత్యర్థులు కుట్రపన్ని తమను ఇలా ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు.

వెంకటరమణ
ఎన్నికల ముందు భయాందోళనకు గురి చేసేందుకే ఇలాంటి విధానాలను కొనసాగిస్తారన్నారు. ఐటి, రెవెన్యూ అధికారులను ఒక ప్రజాప్రతినిధి పురమాయించారని తమకు తెలుసన్నారు.

వెంకటరమణ
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ప్రజలు ఆదరించి ఆశీస్సులు అందిస్తే అద్భుతంగా సేవలు అందిస్తామన్నారు.

వెంకటరమణ
కోట్లాది రూపాయలు డబ్బులు పట్టుపడుతున్నా, మద్యం ఏరులై పారుతున్నా ఏమాత్రం పట్టించుకోని అధికారులు టిడిపి అభ్యర్థిపైనే దాడికి దిగడం, ఇంటిలో చొరబడి పరుపులు, బీరువాలు వెతకడం తమను అవమానించడమేనన్నారు.

వెంకటరమణ
తమ ఇంటిలో ఏమి లేదని తాతయ్య, అమ్మమ్మలు చెపుతున్నా వినిపించుకోకుండా పరుపులు, బీరువాల్లో వెతికారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంకటరమణ
ఈ సమావేశంలో టిడిపి అభ్యర్థి వెంకటరమణ సోదరులు, కుమార్తెలు, పెద్ద అల్లుడు సంజయ్, జయకుమార్, టౌన్బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, సంజయ్, మునిశేఖర్, ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications