20ఏళ్ల యువతిపై ఏడాదిగా సీఆర్పీఎఫ్ జవాన్ రేప్
బల్లియా: 20ఏళ్ల బాలికపై ఏడాదిగా ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ములాయం యాదవ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ తన వదిన తరుపు బంధువుల అమ్మాయి అయిన ఓ 20 ఏళ్ల యువతిని బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించి ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు.

చివరికి ఆమె ఎప్పుడు తనను పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించడంతో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని తప్పించుకోడానికి ప్రయత్నం చేశాడు. దీంతో బాధితురాలు చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఆర్పీఎఫ్ జవాన్ ములాయం యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications