ఎంత పని చేశారు మోడీ సార్ ? సాయిరెడ్డి మరో షాక్..!

ఒకప్పుడు వైసీపీ ఎంపీగా కేంద్రం వద్ద, ప్రధాని మోడీ వద్ద మంచి మార్కులు సంపాదించుకున్న విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆ తర్వాత రూటు మార్చి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత కూడా బీజేపీపై, కేంద్రంపై తన మమకారం వదులుకోలేక వరుసగా ట్వీట్లు పెడుతూ వచ్చిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుబడుతూ సాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు.

కేంద్రం తాజాగా వాణిజ్య గ్యాస్ సిలెండర్ల (Commercial LPG Cyclinder) ధరను ఏకంగా రూ.933 పెంచింది. దీంతో ఇప్పుడు వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర 3 వేలు దాటిపోయింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల వ్యాపారంపై తీవ్రంగా పడుతోంది. ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹2,031 నుండి ₹3,024కు, అంటే ₹933 మేర పెరగడం భారతదేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షలకు పైగా రెస్టారెంట్లకు భారీ షాక్ అన్నారు.

Vijayasai Reddy 933 LPG Price Hike Will Crush Restaurant Margins Trigger Job Losses Across India

కేంద్రం తీసుకున్న గ్యాస్ ధర పెంపు నిర్ణయంతో రెస్టారెంట్ల లాభాలు పూర్తిగా దెబ్బతింటాయని, ధరలు పెరుగుతాయని, వేతన కోతలు, ఉద్యోగ నష్టాల రూపంలో కార్మికులు తీవ్ర భారాన్ని మోయాల్సి వస్తుందని సాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధరల పెరుగుదల వ్యాపారాలను, వినియోగదారులను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ఈ ఇరాన్ యుద్ధం ఇప్పుడే ఆగాలని కోరారు. తద్వారా యుద్దం ఆపి ధరల్ని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని చెప్పకనే చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+