ఇండియాకు ప్రఖ్యాత ఏఐ కంపెనీ "ఆంథ్రోపిక్".. ఫస్ట్ ఆఫీస్ ఎక్కడంటే ??
ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఆంథ్రోపిక్ 2026 ప్రారంభంలో బెంగళూరులో కార్యాలయం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. క్లాడ్ అనే కోడింగ్ అసిస్టెంట్ను అభివృద్ధి చేసిన ఈ సంస్థ.. అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరిం చేందుకు నిర్ణయం తీసుకుంది. ఆంథ్రోపిక్ బెంగళూరు కార్యాలయం టోక్యో తరువాత ఆసియా-పసిఫిక్లో రెండవ కార్యాలయం అవుతుందని అంటున్నారు.
టోక్యో కార్యాలయం 2025లో ప్రారంభం కానుంది. విస్తృత ప్రపంచ విస్తరణ ప్రణాళికలో భాగంగా, అంతర్జాతీయ ఉద్యోగుల సంఖ్యను మూడు రెట్లు, అప్లైడ్ AI బృందాన్ని ఐదు రెట్లు పెంచడం లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం క్లాడ్ వినియోగం.. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో అమెరికాను మించిపోయింది. భారతదేశంలో సాంకేతిక నైపుణ్యం, AIని సమాజంలోని అన్ని వర్గాలకు చేర్చాలనే ప్రభుత్వ నిబద్ధత కారణంగా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత పొందింది.

ఈ మేరకు ఆంథ్రోపిక్ CEO, సహ-వ్యవస్థాపకుడు డారియో అమోడెయ్ మాట్లాడుతూ.. భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు, మా కంపెనీ లక్ష్యానికి మధ్య లోతైన సమన్వయం ఉంది. విభిన్న భాషలు, పరిస్థితులలో AI అమలు, బాధ్యతాయుత పాలన కోసం ఫ్రేమ్వర్క్ల నిర్మాణం - ఈ సమన్వయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బెంగళూరు కార్యాలయం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో సామాజిక ప్రభావం కోసం AIను అమలు చేయడానికి ఉపయోగ పడుతుందని తెలిపారు.
కాగా కంపెనీ హిందీతో పాటు బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో క్లాడ్ ఇండీక్ భాషా సామర్థ్యాలను విస్తరిస్తోంది. ఇది భారతదేశంలో AI అందుబాటు, వినియోగంను మరింత మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
భవిష్యత్తు ప్రణాళికలు..
- బెంగళూరు కార్యాలయం అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన ఇంజినీర్లను, డేటా సైంటిస్ట్లను ఆకర్షించడానికి ప్రధాన కేంద్రంగా మారుతుంది.
- క్లాడ్ AI సాధనాలను మధ్యస్థములు, స్టార్టప్లు, ప్రభుత్వ ప్రాజెక్ట్లు లో అమలు చేయడం లక్ష్యం.
- భవిష్యత్తులో AI సామాజిక ప్రభావాన్ని పెంపొందించడానికి, ఇతర ఆసియా దేశాల్లో కూడా కార్యాలయాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
-
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications