టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఆన్ లైన్ లో ఫ్రీగా AI కోర్సులు.. ఇలా చేయండి
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకొచ్చింది. ఈ క్రమంలోనే దేశంలోని విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాస్ వినూత్నంగా ఆలోచించింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు టెక్నాలజీ, సామాజిక శాస్త్రాలను పరిచయం చేసేందుకు 8 వారాలపాటు ఆన్ లైన్ ద్వారా కోర్సులను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దేశంలోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు చిన్నతనం నుంచే టెక్నాలజీ, సామాజిక శాస్త్రాలపై అవగాహన కల్పించేందుకు స్కూల్ కనెక్ట్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది ఐఐటీ మద్రాస్. ఈ పథకంలో దేశవ్యాప్తంగా 2,300కు పైగా స్కూల్స్ అనుసంధానం అయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచి 61 పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 250 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు తుది గడువుగా నిర్ణయించారు. ఈ లోపు ఆసక్తి ఉన్న టెన్త్, ఇంటర్ విద్యార్థులు తమ విద్యా సంస్థల ద్వారానే పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులకు 8 వారాలపాటు ఆన్ లైన్ లో డేటా సైన్స్ అండ్ ఏఐ, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ , గేమ్స్ అండ్ పజిల్స్ , పర్యావరణం, హ్యుమానిటీస్ తదితర కోర్సులు నేర్పిస్తారు. ఈ కోర్సులతో రికార్డు చేసిన వీడియోలను ప్రతి సోమవారం పోర్టల్ లో అందుబాటులో ఉంచుతారు. ఐఐటీ ప్రొఫెసర్ల తో ప్రతి శనివారం లైవ్ లో కూడా మాట్లాడొచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే అడగొచ్చు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications