Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగ్ సినిమా తెచ్చిపెట్టిన కష్టాలు: పీకల్లోతు ఇరుక్కున్న ధనుష్

ప్రముఖ తమిళ నటుడు ధనుష్.. చిక్కుల్లో పడ్డాడు. ఓ సినిమా ఆయనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. శాపంగా మారింది. అసంపూర్తిగా నిలిచిపోయిన మూవీ అది. దాన్ని కంప్లీట్ చేయకపోవడం అతనికి సవాల్ గా మారింది. 2016లో క్లాప్ కొట్టిన ఈ మూవీ.. ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్లలేదు. హైబడ్జెట్ తో తెరకెక్కాల్సిన చిత్రం అది. పూర్తయివుంటే అతని లెక్క వేరుగా ఉండేది గానీ బెడిసికొట్టింది. అతని కేరీర్ లో ఓ అన్ ఫినిష్డ్ మూవీగా నిలిచింది.

ఈ సినిమా ప్రాజెక్టుల విషయంలో ప్రముఖ నటులు ధనుష్ ఒక్కడే కాదు, మరో కేసులో రణ్ వీర్ సింగ్‌ కూడా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నాడు. ప్రాజెక్టుల జాప్యం లేదా నిలిచిపోవడం వల్ల జరిగిన ఆర్థిక నష్టాలకు పరిహారం కోరుతూ పలు నిర్మాణ సంస్థలు వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు లీగల్ నోటీసులు సైతం పంపించాయి. తాజాగా ధనుష్‌కు ప్రసిద్ధ నిర్మాణ సంస్థ థేనాండాళ్ ఫిల్మ్స్ నుండి ఈ లీగల్ నోటీసు అందింది. 20 కోట్ల రూపాయల పరిహారం కోరుతూ ఈ నోటీసు ఇచ్చింది.

Dhanush Served Legal Notice by Thenandal Films Over Rs 20 Crore Compensation for Unfinished Movie

2016లో థేనాండాళ్ బ్యానర్ లో ఓ భారీ సినిమాను చేయాల్సి ఉంది ధనుష్ కు. 'నాన్ రుద్రన్' అనే పేరును కూడా ఖరారు చేశారు అప్పట్లో. దీనికి ధనుషే హీరో, దర్శకుడు కూడా. అక్కినేని నాగార్జున, ఎస్ జే సూర్య సహా పలువురు స్టార్ క్యాస్టింగ్ ను సెలెక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ థేనాండాళ్ ఫిల్మ్స్ కు మరో బ్లాక్ బస్టర్ చిత్రం చేస్తానని హామీ ఇచ్చాడు గానీ దాన్ని నెరవేర్చుకోలేదు. ఇదే విషయాన్ని ఆ ప్రొడక్షన్ హౌస్ తాజా నోటీసుల్లో పేర్కొంది.

అడ్వాన్స్ చెల్లింపులు, ప్రీ ప్రొడక్షన్ ఖర్చులతో పాటు నాగార్జున, ఎస్ జే సూర్య వంటి నటుల పారితోషికాలతో కలిపి 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది. స్క్రిప్ట్ సమర్పించకపోవడం, ఇతర బాధ్యతలకు ధనుష్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఆలస్యమైందని ఆరోపించింది. ధనుష్ వారం రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తికి తేదీలు కేటాయించాలని నోటీసు కోరింది. స్పందించని పక్షంలో తాము ఈ మూవీపై ఖర్చు చేసిన మొత్తంతో పాటు అదనంగా కోటి రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా 'డాన్ 3' ప్రాజెక్ట్ నుండి వైదొలగిన తరువాత ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వివాదంలో చిక్కుకున్నారు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో జరిగిన నష్టాలను పేర్కొంటూ, నిర్మాణ సంస్థ దాదాపు రూ. 40 కోట్ల పరిహారాన్ని కోరుతోంది. రణవీర్ టీమ్ ఈ ఆరోపణలను ఖండించింది. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన నోటీసుపై సవాల్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+