సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన బిగ్ మూవీ- బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్ షురూ
దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదల విషయంలో సంచలన తీర్పు వెలువడింది. సెన్సార్ సర్టిఫికేషన్ కేసు వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)) ఈ చిత్రానికి 'యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీతో సినిమా విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో సినిమా విడుదలపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న కారణంగా ఈ చిత్రం విడుదలపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత, ఆందోళన నెలకొంది.
సీబీఎఫ్సీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా క్లియరెన్స్ ఆలస్యమైంది. సినిమా నిర్మాతలు, సీబీఎఫ్సీ మధ్య జరిగిన న్యాయ పోరాటం నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు నుంచి తాజా తీర్పు వచ్చింది. యూ/ఏ సర్టిఫికెట్ తో సినిమా విడుదలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీటీ ఆశా బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'జన నాయగన్'.. వాస్తవానికి నేడు పొంగల్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. సీబీఎఫ్సీ ధృవీకరణలో జాప్యం కారణంగా నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేశారు.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని వచ్చిన ఫిర్యాదులతో బోర్డు ఈ చిత్రాన్ని ఒక పరిశీలన కమిటీకి పంపింది. దీనితో నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టులో కేవీఎన్ ప్రొడక్షన్స్ తరపున సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరణ్ వాదించారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఎఫ్సీ నిపుణులతో కూడిన కొత్త కమిటీ ద్వారా సినిమాను తిరిగి పరిశీలించాలని ఆదేశించింది.
ఈ తీర్పు ఇప్పుడు చిత్రం ధృవీకరణ, తదుపరి విడుదలకు మార్గం సుగమం చేసింది. ఈ సినిమా సెన్సార్ ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రారంభంలో- సీబీఎఫ్సీ సభ్యులు వయోలెన్స్ ఉన్న సన్నివేశాలను గుర్తించి, వాటిని తొలగించాలని కోరారు. దీనికి నిర్మాతలు అంగీకరించారు. ఆ తరువాత అదనపు అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో డిఫెన్స్ లోగో చిత్రీకరణకు అధికారిక అనుమతి అవసరం కావడం, అలాగే కొన్ని సన్నివేశాలలో మతపరమైన అంశాలు ఉన్నాయని బోర్డు అనుమానించడం వంటివి ఉన్నాయి.
ఈ సమస్యల వల్ల విడుదల సుదీర్ఘంగా ఆలస్యమైంది. డిసెంబర్ 22న ప్రాథమిక మార్పుల తర్వాత సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ లభిస్తుందని నిర్మాతలకు సమాచారం అందింది. తుది ధృవీకరణకు ముందు ఈ అంశాలను నిపుణుల కమిటీకి పంపారు. సీబీఎఫ్సీ ఆమోదం ఆలస్యం కేవలం తమిళ వెర్షన్నే కాకుండా, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్లను కూడా ప్రభావితం చేసింది. ఈ ఇతర భాషా వెర్షన్లు ధృవీకరించాలంటే మాతృ భాష వెర్షన్కు అనుమతి తప్పనిసరి. దీంతో విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు దీనికి లైన్ క్లియర్ అయింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications