Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలయ్య "అఖండ 2"‌ కి బిగ్ షాక్.. రిలీజ్‌కి బ్రేక్ !

టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణకి సపరేట్ కి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. మొత్తంగా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ 2" చిత్రంలో నటిస్తున్నారు. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

nandamuri-balakrishna-akhanda-2-release-stopped-by-madras-highcourt

అంతే కాకుండా బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండగా.. మరికొద్ది గంటల్లో పెయిడ్ ప్రీమియర్లు సైతం ప్రదర్శితం కానున్నాయి. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఊహించని అడ్డంకి ఎదురైంది. ఈ చిత్రం విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ వ్యవహరం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే..?

'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి ఈరోస్ సంస్థ మహేశ్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే.. 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టులో ఆరోపించింది. ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది.

కాగా మరికొద్ది గంటల్లో సినిమా పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శితం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయం నిర్మాతలతో పాటు అభిమానులకు సైతం బిగ్ షాక్ ఇచ్చింది. ఈ వివాదం త్వరగా పరిష్కారమైతే.. సినిమా విడుదలకు ఆటంకం ఉండదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు "అఖండ 3" గురించి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్ని అఫిషియల్ చేసేలా ఎస్.ఎస్. తమన్ పోస్ట్ చేసిన ఒక ఫొటో క్లారిటీ ఇచ్చేసింది. స్క్రీన్‌పై "JAI AKHANDA" అని పెద్ద అక్షరాల్లో కనిపిస్తున్న పోస్టు ఫుల్ వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+