ఈ సినిమాపై రూ.4,000 కోట్లు పెట్టా- స్టార్ నిర్మాత: రఫ్ కట్ చూసి..
మచ్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ.. రామాయణ: పార్ట్ 1. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోందీ ఫిల్మ్. నితీష్ తివారీ దర్శకుడు. ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతోంది.. ప్రపంచవ్యాప్తంగా. అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న సినిమాల్లో ఇదీ ఒకటి. బడ్జెట్, నిర్మాణ వ్యయం హాలీవుడ్ రేంజ్ ను మించిపోయిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఏకంగా 4,000 కోట్ల రూపాయలతో సినిమా రూపుదిద్దుకుంటోంది.
రెండు భాగాలుగా రూపొందుతోంది రామాయణ. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా సాయి పల్లవి నటిస్తోన్నారు. లంకాధిపతి రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ మెరుపులు మెరిపించనున్నాడు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస్ నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీనెగ్, యష్కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఇందులో భాగస్వామ్యం అయ్యాయి.

దీని ఫస్ట్ రఫ్ కట్ స్క్రీనింగ్ ముగిసింది. అమెరికా లాస్ ఏంజిలిస్ లోని సినిమార్క్ ప్లయా విస్టాలో ఈ సినిమా రఫ్ కట్ ను ప్రదర్శించారు. ఇది రామాయణం పార్ట్ 1 ప్రీ కట్ వెర్షన్. 18 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సున్న ప్రేక్షకులు దీనికి హాజరయ్యారు. ప్రత్యేకించి- హాలీవుడ్ స్టూడెంట్ల కోసం ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రత్యేక స్క్రీనింగ్కు హాజరైన ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన వీఎఫ్ఎక్స్, భారీ నిర్మాణం, నటీనటుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
The Ramayana USA Test screening went extremely well 🥳
— The Ramayana 🏹 (@RamayanaSaga) February 24, 2026
Mainly film student were invited and Everyone was extremely positive about the movie especially the story & screenplay. It was the first cut and there was no interval in the film (for this cut) pic.twitter.com/aROxZYPiKy
'ది వీక్' దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, కథనం, చిత్రీకరణపై ప్రేక్షకుల సానుకూల స్పందన లభించిందని తెలిపింది. భారీబడ్జెట్ చిత్రం కావడం వల్ల ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిర్మాతలు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 'ఆదిపురుష్' వంటి ఫెయిల్యూర్స్ ఉన్న నేపథ్యంలో అదే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 4,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు నమిత్ మల్హోత్రా తెలిపారు. గేమ్ ఛేంజర్స్ అనే పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. పార్ట్ 1 షూటింగ్ దాదాపు పూర్తయిందని, సినిమా ప్లాన్ చేసినప్పుడు భారీ విజన్ ఉందని, అందుకే ఖర్చుకు వెనుకాడలేదని తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఎక్కడా అప్పు తీసుకోలేదని, డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ సినిమాను ఓప్రాజెక్ట్ లేదా వ్యాపారంగా చూడట్లేదని తెలిపారు.
-
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..!












Click it and Unblock the Notifications