తెలుగు సినీ పరిశ్రమలో శత్రుత్వాలు వీరి మధ్యేనా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అంటే సినిమాల పరంగా, రికార్డుల పరంగా అన్నమాట. అయితే రోజులు గడిచేకొద్దీ ఈ వైరం మితిమీరి వ్యక్తిగత దూషణలకు దారితీసింది. ఆరోగ్యకరమైన పోటీ కాస్తా అనారోగ్యకరంగా మారింది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కారణాలు, రాజకీయ విభేదాలు లేదా కుటుంబాల మధ్య ఉన్న పాత గొడవల వల్ల కొందరు హీరోలు ఒకరినొకరు కలుసుకోవడానికి లేదా మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడటంలేదు. కొన్ని సంవత్సరాల నుంచి కొందరు స్టార్ హీరోలు ఎడముఖం, పెడముఖంగా ఉంటున్నారు.
చిరంజీవి, రాజశేఖర్ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ విడుదల సందర్భంగా వేదికపై జరిగిన గొడవ వీరి మధ్య దూరాన్ని పెంచాయి. సినిమా కథలు కొనుగోలు విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. చిరు అభిమానులు రాజశేఖర్ కారుపై దాడిచేశారు. దానికి చిరు సారీ చెప్పారు. ప్రస్తుతానికి బాగానే ఉంటున్నప్పటికీ గతంలో ఉన్న మనస్ఫూర్తిగా అయితే లేరని చెప్పొచ్చు.

మంచు విష్ణు, మంచు మనోజ్ ఎలా గొడవలు పడ్డారో అందరం చూశాం. ఆస్తి తగాదాలని కొందరు అన్నారు.. అనసవరంగా డబ్బులు తగలేస్తున్నారని మనోజ్ అన్నారు. మోహన్ బాబు విష్ణుకు మద్దతు తెలిపారు. మనోజ్ రెండోపెళ్లి భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డితో జరిగింది. ఈ పెళ్లి కూడా మోహన్ బాబుకు ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన వివాదంలో కూడా మనోజ్ విద్యార్థులకు అనుకూలంగా మాట్లాడారు. దీంతో అన్నదమ్ములిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి.
చిరంజీవి, మోహన్ బాబు కొన్ని దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. స్నేహం ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరు తరుచుగా వ్యంగ్యపరమైన వ్యాఖ్యలు చేసుకునేవారు. పరిశ్రమలో పెద్దరికం తీసుకునే విషయంలో, పరిశ్రమ 75 సంవత్సరాల వేడుక జరిగే సమయంలో వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. సెలబ్రిటీ, లెజెండ్ పేర్ల విషయంలో కూడా వాదోపవాదాలు జరిగాయి. ఇంత వైరం ఉన్నా, అకస్మాత్తుగా కలిసి కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.
చిరంజీవి కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబం మధ్య దూరం బాగా పెరిగింది. అల్లు అర్జున్ స్వతంత్రతను కోరుకోవడం, మెగా అనే ముద్ర లేకుండా సొంత బ్రాండ్ ఉండాలనుకోవడంతోపాటు రామ్ చరణ్ తో జరిగిన బయటపడని వివాదం కూడా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి కారణమైంది. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కు మద్దతు తెలపకుండా, వైసీపీ తరఫున తన స్నేహితుడి కోసం ప్రచారానికి వెళ్లడం కూడా ఒక కారణం. ఈ వివాదాలన్నీ కలిసి మెగా, అ్లల్లు కుటుంబాల మధ్య దూరం పెంచాయి.
బాలకృష్ణ, నాగార్జునకు కొన్ని సంవత్సరాల నుంచి పడటంలేదు. ఓ వేడుకలో బాలయ్య అక్కినేని, తొక్కినేని అంటూ మాట్లాడారు. ఇది పెద్ద దుమారాన్ని కలిగించింది. ఈ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ తీవ్రంగా స్పందించారు. గతంలో హీరోలంతా పైకి గొడవలు పడుతున్నట్లు కనపడినా, మనస్ఫూర్తిగా కలిసివుండేవారు. కానీ ఇప్పటి హీరోలు మాత్రం పైకి మాములుగా కనపడుతున్నా, లోపల మాత్రం తీవ్ర విభేదాలతో ఉన్నారు.
-
"ఉస్తాద్" ఊచకోతకు సిద్ధమా.. మార్చి 19 రిలీజ్ ఫిక్స్ ! -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
మనసున్న మారాజు.. మా ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్"... -
"రేప్" చేస్తామంటూ రోజూ బెదిరిస్తున్నారు..! -
200 మంది ముందే సమంతతో రొమాంటిక్ సీన్స్..! -
"జూమ్ చేసి మా బాడీ పార్ట్స్ ను తీయోద్దు" -
వాళ్లు అందరూ సర్వనాశనం అయిపోతారు - చలాకీ చంటి -
ఓ మెట్టు ఎక్కేశావయ్యా.. సొంతూరు కోసం విజయ్ ఏం చేయబోతున్నారంటే ?? -
మెగా కాంపౌండ్ లో తళుక్కుమన్న మలయాళ స్టార్- ఊహాగానాలకు ఆజ్యం? -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
వాయిదా పడ్డ రూ.1,000 కోట్ల సినిమా -
వెంకటేష్ వద్దంటే బాలయ్య చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు












Click it and Unblock the Notifications