రూ. 72,000 జీతంతో ఉద్యోగాలు.. అప్లై చేసుకున్నారా..?
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 8లోపు అప్లై చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
మొత్తం పోస్టులు: 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్- బీ నాన్ గెజిటెడ్ కేటగిరీ)
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. 05 ఫిబ్రవరి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. మార్చి 8 లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 18-30 మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది
ఎంపిక విధానం : ఆన్ లైన్ విధానంలో టెస్టు ఉంటుంది. ఆతర్వాత టైపింగ్ టెస్టు, డిస్క్రిప్టివ్ టెస్టు, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారితో ఎంపికైన జాబితా ప్రకటిస్తారు.
వేతనం: అన్నీ కలిపి నెలకు రూ. 72,040
అప్లై ఎలా..?
సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అసిస్టెంట్ https://www.sci.gov.in/ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్స్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ పూర్తిచేసి సెండ్ చేయాలి. ఆ తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
పరీక్ష విధానం: రెండు పేపర్లు ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ అప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అంశాలు ఉంటాయి. పార్ట్ 2లో కంప్యూటర్ నాలెడ్జ్(25మార్కులు) ఉంటుంది. మొత్తం 125 మార్కులు ఉంటాయి. 2 గంటలపాటు పరీక్ష ఉంటుంది.












Click it and Unblock the Notifications