ఈనెల 10వ తేదీలోపు APPSC GROUP 2 నోటిఫికేషన్...
APPSC గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు ఇటీవల ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించిన సంగతీ అందరికి తెలిసిందే. అయితే, ఇప్పడు ఈనెల 10వ తేదీలోపు APPSC GROUP 2 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-2 రాత పరీక్షలకు కొత్త సిలబస్ విడుదల చేసిన విషయం విదితమే. గ్రూప్ 2 పరీక్షలో రెండు దశల్లో రాతపరీక్ష ఉంటుంది. మొత్తం 450 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్లో అర్హత సాధించినవారే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులుగా భావిస్తారు.
గ్రూప్ 2 పరీక్ష విధానం : మొదటి దశలో జరిగే స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. రెండో దశలో జరిగే మెయిన్స్ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్లో అర్హత సాధిస్తేనే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు. అయితే, గతంతో పోల్చుకుంటే ఇప్పటి సిలబస్లో చాలా మార్పులు చేశారు. తాజా సిలబస్ ప్రకారం, ప్రిలిమ్స్లో కొత్తగా భారతీయ సమాజం అనే అంశాన్ని చేర్చడం జరిగింది. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక, మెయిన్స్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కులు. మొయిన్స్ మొత్తం 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడగగా, పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications