Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

JEE Main 2025 results: ఫలితాలు వచ్చేశాయ్- పల్నాడు విద్యార్థిని గుత్తికొండ సాయి మనోజ్ఙకు 100

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న జేఈఈ మెయిన్ సెషన్ 2 (JEE Main results) ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్దిసేపటి కిందటే వీటిని విడుదల చేసింది. ఈ ఫలితాలను ఎన్టీఏ వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో పొందుపరిచింది. జేఈఈ మెయిన్, ఎన్టీఏ రిజల్ట్స్ అనే వెబ్‌సైట్లలో పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ లింక్ jeemain.nta.nic.in, ntaresults.nic.in. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌తో పాటు అగ్రిగేట్ పర్సెంటైల్ మార్కుల స్కోరింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ఈ వెబ్‌‌సైట్స్‌లల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు.. ఈ లింక్స్‌ను క్లిక్ చేయడం ద్వారా వాటిని తెలుసుకోవచ్చు.

JEE Main session 2 result has been declared

ఈ ఏడాది మొత్తం 24 మంది విద్యార్థులు 100 శాతం మార్కులను అందుకున్నారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులు ఉన్నారు. పల్నాడు జిల్లాకు చెందిన విద్యార్థిని గుత్తికొండ సాయి మనోజ్ఙకు 100కు 100 మార్కులను సాధించారు. రెండు సెషన్‌లలోనూ కూడా సాయి మనోజ్ఞ వందకు వంద మార్కులతో టాపర్‌గా నిలిచారు. పశ్చిమ బెంగాల్‌ విద్యార్థిని మాఝీ 99.99921 శాతం మార్కులు సాధించారు.

ఈ 24 మంది విద్యార్థుల్లో ఎండీ అనాస్, ఆయుష్ సింఘాల్, ఆర్కిస్మాన్ నంది, దేవదత్త మాఝి, ఆయుష్ రవి చౌదరి, లక్ష్య శర్మ, కుశాగ్ర గుప్తా, హర్ష్ ఎ గుప్తా, ఆదిత్ ప్రకాష్ భగాడే, దక్ష్, హర్ష్ ఝా, రజిత్ గుప్తా, శ్రేయాస్ లోహియా, సక్షమ్ జిందాల్, సౌరవ్, వంగల అజయ్ రెడ్డి, సాన్నిధ్య షరాఫ్, విషాద్ జైన్, అర్నవ్ సింగ్, శివేన్ వికాస్ తోష్నివాల్, సాయి మనోజ్ఞ గుత్తికొండ, ఓం ప్రకాష్ బెహెరా, బణి బ్రత మాఝీ ఉన్నారు.

జేఈఈ మెయిన్ పేపర్ 1 సెషన్ 2లో మొత్తం 9,92,350 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు, వీరిలో 6,81,871 మంది మహిళలు, 3,10,479 మంది పురుషులు ఉన్నారు. వారిలో జనరల్ కేటగిరీలో అత్యధికంగా 3,72,675 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,50,849 మంది మహిళలు, 1,21,826 మంది పురుషులు ఉన్నారు.

ఓబీసీ కేటగిరీలో 3,74,860 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,58,274 మంది మహిళలు, 1,16,586 మంది పురుషులు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1,12,790 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా ఇందులో 80,200 మంది మహిళలు, 32,590 మంది పురుషులు ఉన్నారు.

ఎస్సీ కేటగిరీలో 97,887 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 68,872 మంది మహిళలు, 29,015 మంది పురుషులు ఉన్నారు. ఎస్టీ కేటగిరీలో అత్యల్పంగా 34,138 మంది పరీక్షలు రాయగా.. 23,676 మంది మహిళలు, 10,462 మంది పురుషులు ఉన్నారు. అన్ని కేటగిరీల్లో కూడా మహిళా అభ్యర్థులు అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+