POWERGRID Recruitment: 425 డిప్లోమా ట్రైనీ పోస్టులు, రూ. లక్ష వరకు జీతం
న్యూఢిల్లీ: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(POWERGRID) వివిధ డిప్లొమా ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 23. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.powergrid.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
POWERGRID రిక్రూట్మెంట్ 2023 ఖాళీల వివరాలు:
425 డిప్లొమా ట్రైనీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.
POWERGRID రిక్రూట్మెంట్ 2023 వయోపరిమితి:
అభ్యర్థుల గరిష్ట వయస్సు సెప్టెంబర్ 22 నాటికి 27 సంవత్సరాలు ఉండాలి.

POWERGRID రిక్రూట్మెంట్ 2023 దరఖాస్తు రుసుము:
SC/ST/PwBD, ఎక్స్-సర్వీస్మెన్ మినహా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 300.
POWERGRID రిక్రూట్మెంట్ 2023 ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఆధారంగా ఉంటుంది. వ్రాత పరీక్ష రెండు గంటల వ్యవధిలో ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది. ఇందులో భాగంగా I టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్, పార్ట్ II సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి.
రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్లిస్ట్ను తయారు చేసి, వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ. 27,500 స్టైఫెండ్ చెల్లిస్తారు.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రేడ్-4 జూనియర్ ఇంజినీర్గా రూ. 25,000 నుంచి రూ. 1,17,500 వరకూ వేతనం ఉంటుంది. మూల వేతనంతోపాటు డీఏ, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.












Click it and Unblock the Notifications