తెలంగాణ నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్న్యూస్
తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. అయితే, వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి గ్రూప్- 1 నిర్వహిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు.
కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రక్షాళన ఆలస్యం అయ్యిందని సీఎం రేవంత్ తెలిపారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారన్న రేవంత్.. 15 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జీరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం కాదని రేవంత్ రెడ్డి గత సర్కారుకు చురకలంటించారు.

ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నాం. సీఎంవోలో మైనార్టీ ఐఏఎస్లకు కీలక బాధ్యతలు అప్పగించాం. మైనార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఃమరోవైపు, ప్రజావాణి(Praja Vani)లో ధరణి, హౌసింగ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదు వస్తున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాభవన్లో ఐఏఎస్ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని వెల్లడించారు. ముళ్ల కంచెలు త్వరగా కూల్చేందుకే డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేశామని రేవంత్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కలుస్తారని, ప్రజా సమస్యలను తన దృష్టికి తెచ్చేందుకు వస్తున్న ఎవరినైనా కలుస్తానని చెప్పారు. విపక్ష నేత తన సొంత మనుషులను కూడా అనుమానిస్తున్నారని రేవంత్












Click it and Unblock the Notifications