గురుకులాల్లో 9వేల పోస్టుల భర్తీ: అందుబాటులోకి ఓటీఆర్ రిజిస్ట్రేషన్
హైదరాబాద్: తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఇటీవల గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి 9 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు కేటగిరీలవారీగా ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రాంరభం కానుంది.
కాగా, ఓటీఆర్ నమోదు చేస్తేనే గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈ మేరకు ఓటీఆర్ నమోదుకు సంబంధించిన వెబ్లింక్ను గురుకుల నియాయమక బోర్డు వెబ్సైట్ https://treirb.telangana.gov.in/లో అందుబాటులో ఉంచింది.

ఓటీఆర్ నమోదు కోసం తొలుత ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. తర్వాత వ్యక్తిగత వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7 వరకు చదవిని జిల్లాను నమోద చేయాలి. దీంతో ఓటీఆర్ పూర్తవుతుంది.
అనంతరం నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఓటీఆర్ నమోదు తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయి.. అర్హత కలిగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక పరీక్ష ఫీజు చెల్లించి, మిగితా వివరాలు నమోదు చేయడం ద్వారా దరఖాస్తు పూర్తవుతుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications