రంగమ్మత్త కోసం ఎగబడ్డ జనం
యాంకర్, నటి అనసూయకు ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది. అనసూయ వల్లే బుల్లితెరకు కొత్త హంగులు సమకూరాయి. ఆడియన్స్ కు ఎంతో ఎంటర్ టైన్మెంట్ ను అందించింది. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి తన ప్రతిభను నిరూపించుకుంది. బుల్లితెరపై అందాలను ఒలకబోయడమే కాకుండా తనలోని డ్యాన్స్ స్కిల్స్, నటనను కూడా ప్రదర్శించింది. అలా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ నటిగా అందరినీ అలరిస్తోంది.
తాజాగా అనసూయ విజయనగరంలో ప్రజలను పలకరించింది. ఈ జిల్లాలోని శృంగవరపుకోట ప్రాంతంలో ఆదిలక్ష్మి సిల్క్స్ స్టోర్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు ట్రాన్స్ పరెంట్ శారీలో మెరిసింది. తన అందంతో, చీరకట్టుతో ఆకట్టుకుంది. ప్రజలతో స్టోర్ ను ప్రమోట్ చేస్తూ మాట్లాడటమే కాకుండా అభిమానులతో కూడా ముచ్చటించింది. అనసూయ అక్కడికి వచ్చిందని తెలిసిన వెంటనే అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు.

వాస్తవానికి అనసూయకు ఇంత క్రేజ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయ లుక్ ను అభిమానులు మెచ్చుకోవడమే కాకుండా వాటిని షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. అనసూయ తాజా చిత్రం 'రజాకార్' రేపు విడుదల కానుంది. అలాగే'పుష్ప2' ఆగస్టు 15న విడుదలవుతోంది.
అనసూయకు 38 సంవత్సరాల వయసు అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరు. అంత ఫిట్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ హీరోయిన్లకు కూడా ఉండదు. తాను చేసే ఫొటో షూట్స్ చూస్తే మాత్రం పిచ్చెక్కడం ఖాయం. వీలున్నప్పుడల్లా భర్త, పిల్లలతో కలిసి యాత్రలకు వెళుతుంటుంది. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.












Click it and Unblock the Notifications