Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"ప్రధాని మోదీ కోసం 'అఖండ 2' స్పెషల్‌ షో"

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ 2 చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సనాతన హైందవ ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలో దేశం, దైవం, ధర్మం అనే మూలాల గురించి నేటి తరానికి వివరించిన తీరు అబ్బుర పరుస్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. అఖండ భారత్ బ్లాక్ బస్టర్ పేరుతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు.

ఈ సినిమా చూసి సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని బాలయ్య అన్నారు. ప్రకృతి, పిల్లల జోలికొస్తే దేవుడు ఏం చేస్తాడో అఖండ చిత్రంలో చూపించామని తెలిపారు. ఈ అఖండ 2 చిత్రంలో మనిషే దేవుడు అయితే ఎలా ఉంటుందో చూపించామని బాలయ్య వివరించారు. అఖండ 2 సినిమాలో ప్రతి డైలాగ్ ఓ ఆణిముత్యం అని అన్నారు. ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఐదు సినిమాలు వరుసగా హిట్స్ కొట్టానని.. ఆరో సినిమా కూడా రాబోతోందని బాలయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ సక్సెస్ తన ఒక్కడి వల్లే వచ్చింది కాదని.. ఎంతో మంది కృషి ఉందని వివరించారు.

ఇక అఖండ- 2 డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఈ సినిమా దేవుడి సంకల్పం అని.. దేవుడు అనుకుంటే గెలుపే ఉంటుందని ఎమోషనల్ అయ్యారు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అఖండ 2 త్రీడీలో సరికొత్త అనుభూతిని పంచుతోందన్నారు. సినిమా పరిశ్రమ అంతా ఒకే వేదికపైగా రావాలని ప్రతి ఒక్కరూ బాగుండాలని పేర్కొన్నారు. అలాగే ఈ మూవీని దిల్లీలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అఖండ 2 షోను ప్రధాని మోదీ చూడబోతున్నారని వివరించారు. మరోవైపు ఈ మూవీపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనును అభినందించారు. సినిమా అఖండ విజయం సాధించాలని ఆశీర్వదించారు.

Boyapati Srinu Announces Special Screening of Akhanda 2 for PM Modi in Delhi

ఇక అఖండ 2 మూవీ.. 2021 లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ మూవీలోనూ బాలయ్య డ్యూయల్ రోల్ లో మెప్పించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. విలన్​ గా ఆది పినిశెట్టి నటించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్​ అందించారు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ భారీ బడ్జెట్​ తో నిర్మించింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ​, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మూవీ డిసెంబర్ 12 న రిలీజైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+