సెంట్రల్ జైల్లో హీరో దర్శన్ ను కలిసిన విజయలక్ష్మి, ప్రత్యేక రూమ్ లో ?, ఆ విషయంలో !
బెంగళూరులో చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని హత్య చేశారని నమోదు అయిన కేసులో నిందితులుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్, అతని గర్ల్ ఫ్రెండ్, నటి పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది ఇప్పుడు జైలులో ఉన్నారు.
బెంగళూరు శివార్లలోనిపరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ జైలుకు వెళ్లి సోమవారానికి 25 రోజులు పూర్తి అయ్యింది.హీరో దర్శన్ ను ఆయన భార్య విజయలక్ష్మి, హీరో సోదరుడు దినకర్ తూగుదీప్ సెంట్రల్ జైలుకు వెళ్లి ఛాలెంజింగ్ స్టార్ ను కలిశారు.నాలుగోసారి విజయలక్ష్మి దర్శన్ ను కలవడానికి సోమవారం సెంట్రల్ జైలుకు వెళ్లారు. విజయలక్ష్మి, సొంత సోదరుడు దినకర్ ను చూడగానే హీరో దర్శన్ కొంచెం ఉద్వేగానికి లోనయ్యారని తెలిసింది. జైలులోని ప్రత్యేక గదిలో అరగంటపాటు దర్శన్తో ఆయన భార్య విజయలక్ష్మి చర్చించారని సమాచారం.

బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో ఉన్న దర్శన్ తనను ఎవరు పరామర్శించినా రేణుకాస్వామి హత్య కేసు గురించి, ఆయన అభిమానుల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మాట్లాడినట్లు తెలుస్తోంది. దర్శన్ ఏదో పనికి వెళ్తే ఏదో జరుగుతుందనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.
నటుడు ధన్వీర్, నిర్మాత కె మంజు, ఆయన భార్య విజయలక్ష్మిని సెంట్రల్ జైలులో కలిసినప్పుడు కూడా దీనిపైనే చర్చించారని సమాచారం.అభిమానులు ఆందోళన చెందవద్దు అని, తనను చూడటానికి జైలు దగ్గరకు రావద్దు అని మీరు చెప్పాలని హీరో దర్శన్ ఆయన్ను కలిసినవారికి చెబుతున్నారని తెలిసింది.
ఇంతకీ దర్శన్ ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ ఎందుకు రిపీట్ చేస్తున్నాడు? అనే విషయం అర్థం కావడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. దర్శన్ ఎందుకు జైలుకు వెళ్లాడు, అంతకు ముందు జరిగిన సంఘటన గురించి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జైల్లో పుస్తకాలు చదవడం.. వ్యాయామం చెయ్యడం, తెల్లవారుజామున నిద్రలేచి వేడినీళ్లు తాగడం.. ధ్యానం చేయడం.. ఇలా దర్శన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, జైల్లో కూల్ గా ఉండేందుకు దర్శన్ అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని జైలు సిబ్బంది అంటున్నారు. హీరో దర్శన్ ను చాలా మంది కలవడానికి ప్రయత్నిస్తున్నా వారిని కలవడానికి ఆ హీరో అంగీకరించడం లేదని తెలిసింది. హీరో దర్శన్ ను ఆయన భార్య విజయలక్ష్మి ఇప్పటికే నాలుగుసార్లు కలిశారు.












Click it and Unblock the Notifications