'ఐ బొమ్మ'లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి!
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ కు లేదంటే మల్టీ ప్లెక్స్ కు వెళ్లి సినిమా చూసే సాహసం ఎవరూ చేయడంలేదు. ఎందుకంటే తక్కువలో తక్కువగా ఇద్దరు వ్యక్తులకు రూ.వెయ్యి నుంచి రూ.1500 అవుతోంది. ఎంతో జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటేనే అంత అవుతోంది. టికెట్ ధర కన్నా థియేటర్ లో, మల్టీప్లెక్స్ లో క్యాంటిన్లలో ఉండే తినుబండారాల ధరలతో ప్రజలను మాత్రం భారీగా దోచేస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు హడావిడిగా నాలుగైదు తనిఖీలు నిర్వహిస్తాయి.. రెండు మూడు కేసులు నమోదు చేస్తాయి.. అంతే.. ఆ తర్వాత అటువైపు తొంగిచూడవు.
కుటుంబంతో వెళితే రూ.4వేలు
కుటుంబంతో కలిసి వెళితే.. చిన్న పిల్లలు ఉంటే కనీసం రూ.4వేలు అవుతోంది. ఓ మధ్యతరగతి కుటుంబానికి అంత ఖర్చుపెట్టడం అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నప్పటికీ ప్రత్యామ్నాయం దొరకలేదు. కరోనా తర్వాత మాత్రం వారికి ప్రత్యామ్నాయం దొరికింది. ఓటీటీల రూపంలో. ఇప్పుడు అవి కూడా సబ్ స్క్రిప్షన్ ధరను రోజురోజుకు పెంచేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రజలు థర్డ్ పార్టీ వెబ్ సైట్ లను ఆశ్రయిస్తున్నారు.

ప్రథమస్థానంలో ఐబొమ్మ
ఏపీ, తెలంగాణలో ఎక్కువ మంది ప్రజలు చూసే వెబ్ సైట్ గా ఐబొమ్మ మొదటి స్థానంలో నిలిచింది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ సైట్ లో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. సంచలన విజయం సాధించిన తేజ సజ్జా హనుమాన్, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, మళయాళం డబ్బింగ్ మూవీ అబ్రహం ఓజ్లర్, లంబసింగి, భూతద్దం భాస్కర్, మమ్ముట్టి భ్రమయుగంతోపాటు మళయాళంలో సంచలన విజయం సాధించి ఓటీటీలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా తెలుగులో అందుబాటులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications