వేల కోట్ల ఆస్తి ఉన్నా హీరోగా నో హిట్.. భార్య కూడా తెలుగు హీరోయినే ??
చిత్ర పరిశ్రమలో రాణించాలనే కలతో ఎంతో మంది ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. కానీ ప్రతిభ, కృషి ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక ఆశించిన స్థాయిలో మెప్పించలేక వెనుదిరిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ నటుడు సచిన్ జోషి ఒకరు. హీరోగా ఆయన కెరీర్ పెద్దగా సక్సెస్ కాకపోయినా.. వ్యాపార రంగంలో, వ్యక్తిగత జీవితంలో మాత్రం అద్భుత విజయాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఫిల్మ్ కెరీర్..
2002లో వచ్చిన 'మౌనమేలనోయి' చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన సచిన్ జోషి.. ఆ తర్వాత 'నిన్ను చూడక నేనుండలేను', 'ఒరేయ్ పండు' వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆయనకు హీరోగా గుర్తింపు దక్కలేదు. దీంతో కొంతకాలం పాటు టాలీవుడ్కు దూరంగా ఉన్నారు. తెలుగులో ఆశించిన ఫలితం రాకపోవడంతో.. బాలీవుడ్ వైపు దృష్టి మళ్లించారు. అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, పెద్దగా విజయాలు సాధించలేకపోయారు.

దీంతో హిందీలో భారీ విజయం సాధించిన Aashiqui 2 చిత్రాన్ని.. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'నీ జతగా నేననుండాలి' అనే మూవీతో వచ్చారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించినా కమర్షియల్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. దీంతో హీరోగా ఆయన కెరీర్ దాదాపు ముగిసినట్టయింది. హీరోగా విజయాలు అందకపోయినా, సచిన్ జోషి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. Next Enti? వంటి చిత్రాలను నిర్మించి పరిశ్రమలో తన ఉనికిని కొనసాగించారు.
అంతేకాకుండా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)లో పాల్గొని మరో రంగంలోనూ తన ప్రతిభను చూపించారు. వినోద రంగంలో విభిన్న మార్గాల్లో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తెరపై ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా, వ్యాపార రంగంలో మాత్రం సచిన్ జోషి అద్భుతంగా రాణించారు. 'వైకింగ్ గ్రూప్' పేరిట అనేక వ్యాపార సంస్థలను నడుపుతూ భారీ స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ఎనర్జీ, బేవరేజెస్ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టి వేల కోట్ల ఆస్తులకు అధిపతిగా ఎదిగారు. ముఖ్యంగా గోవాలో ఉన్న లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ ఆయన వ్యాపారంలో కీలక భాగంగా నిలిచాయి.
భార్య కూడా తెలుగు హీరోయిన్..
సచిన్ జోషి నటి Urvashi Sharmaను వివాహం చేసుకున్నారు. ఊర్వశి శర్మ 2008లో 'నఖాబ్' చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు పొందింది. అలాగే 'ఖట్టా మీఠా', 'ఆక్రోష్' వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో శేఖర్ సూరి దర్శకత్వంలో వచ్చిన 'త్రీ' చిత్రంతో పరిచయమైనప్పటికీ.. ఆ సినిమా ఫలితం నిరాశ కలిగించడంతో ఆమె మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ఇక వివాహం తర్వాత ఊర్వశి శర్మ పూర్తిగా సినిమాలకు దూరమై కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications