'కాంతార' సినిమాలో నటిస్తే చావేనా..? ఎంతమంది చనిపోయారో తెలుసా..?
కాంతార' సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత, దాని ప్రీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి వరుసగా జరుగుతున్న అపశృతులు, మరణాలు కన్నడ సినీ పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు మృతి చెందగా, తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.
'కాంతార' ప్రీక్వెల్పై విషాద ఛాయలు: వరుస మరణాలు.. అసలేం జరుగుతోంది?
'కాంతార' ప్రీక్వెల్ కోసం శ్రమిస్తున్న చిత్ర బృందంలో వరుస మరణాలు చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ప్రముఖ కన్నడ నటుడు, కళా దర్శకుడు దినేష్ మంగళూరు గుండెపోటుతో మృతి చెందారు. 'కిచ్చా', 'కిరిక్ పార్టీ', 'కేజీఎఫ్' వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న దినేష్ మరణం కన్నడ పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. 'కాంతార' షూటింగ్ సమయంలో దినేష్కు స్ట్రోక్ వచ్చి కోలుకున్నప్పటికీ, ఇటీవలి అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు.

ఈ మరణానికి ముందు కూడా, 'కాంతార' ప్రీక్వెల్తో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. రాకేష్ పూజారి (36), కపిల్ (32), కళాభవన్, ప్రభాకర్ కళ్యాణి మృతి చెందినట్లు కథనాలొచ్చాయి. ఈ వరుస అపశృతులు అగ్నిప్రమాదాలు, పడవ ప్రమాదాల రూపంలో కూడా ఈ సినిమా యూనిట్ను వెంటాడుతున్నాయి.
ఈ విషయాలపై స్పందించిన 'కాంతార' ప్రీక్వెల్ నిర్మాతలు వీటిని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతుందని, మరణించిన కొంతమందితో తమ సినిమాకు సంబంధం లేదని వారు పేర్కొన్నారు. అయితే, ఇంత చిన్న వయసులో, రకరకాల కారణాలతో ఇంతమంది మరణించడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.
దినేష్ మంగళూరు కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా, కళా దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు. 2004-05లో శివరాజ్కుమార్ నటించిన 'రాక్షస' చిత్రంలో తన కృషికి గాను ఉత్తమ కళా దర్శకుడి అవార్డును కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణం ఈ వరుస విషాదాల జాబితాలో చేరడంతో, 'కాంతార' ప్రీక్వెల్ బృందం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ దురదృష్టకర సంఘటనల వెనుక ఉన్న కారణాలు ఏంటనేది అంతుపట్టకుండా ఉంది.












Click it and Unblock the Notifications