కేజిఎఫ్ మూడో భాగం స్క్రిప్ట్ రెడీ... డైరెక్టర్ ఎవరో తెలుసా..?
కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కేలా చేసిన చిత్రం కేజీఎఫ్. ఈ సినిమా ఆ ఇండస్ట్రీకి ఎంతో పేరు తెచ్చిందో, అందులోని నటీనటులకు కూడా అంతే పేరుతెచ్చింది. ఒకే ఒక్క చిత్రంతో కేజీఎఫ్ నటుడు యష్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాదు దీని రెండో భాగమైన కేజీఎఫ్ 2 కూడా విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది. కెజీఎఫ్ రెండు పార్ట్లు బాలీవుడ్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసాయి.
ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. అంతేకాదు, విడుదలయిన ప్రతి భాషల్లోనూ రికార్డులు కైవసం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేజీఎఫ్ 3 గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం కేజీఎఫ్ మూడో భాగం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని. త్వరలోనే స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

అయితే, ఈ సినిమాకు ఎవరు దర్శకుడో తెలియదని చెప్పారు. కానీ, కేజీఎఫ్లో మాత్రం యష్ ఓ కీలకసభ్యుడని అన్నాడు. కేజీఎఫ్ 3కి దర్శకుడు ఎవరో తెలియదని ప్రశాంత్ నీల్ అనడంతో యష్ అభిమానులకు మాత్రం కాస్త కంగారుగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు భాగాల్లో రికార్డుల వర్షం కురిపించిన ఈ చిత్రం.. మూడో భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, కేజీఎఫ్ పార్ట్ 3 డైరెక్టర్పైనే కాస్త సందిగ్ధత నెలకొంది. ఇక, ఈ మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటనలు కూడా రానున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలఖారు నుంచి సలార్ 2 రెగ్యులర్ షూటింగ్..
ఇక, దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్తో పాటు సలార్ వంటి బ్లాక్బస్టర్ హిట్ను కూడా అందించాడు. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ కూడా జరుగుతోంది. అలాగే ఈ నెల ఆఖరు నుంచి సలార్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరగనుందని దర్శకుడ ప్రశాంత్ నీల్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇక, ఈ సినిమాలో ప్రభాస్తోపాటు చాలామంది స్టార్ హీరోలు కూడా కనిపించనున్నారు. ఈ సినిమాలోని ప్రభాస్ ఎంట్రీకి ప్రిన్స్ మహేష్బాబు వాయిస్ ఇస్తున్నట్లు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..!
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications