మెగాస్టార్ ఆ రెండు సినిమాలు అంటే బాలయ్యకు అంత ఇష్టమా..?
నందమూరి నటసింహం బాలయ్యకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలానే త్వరలోనే తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.
అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఒక జనరేషన్ ని అలరిస్తే.. ఆ తర్వాత తరంలో కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు మెప్పించారు. ఇక వారి తర్వాత వచ్చిన వారిలో బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోలుగా నిలిచారు. వెంకీ, నాగ్ క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ లను అలరిస్తే.. బాలయ్య, చిరు మాస్ ప్రేక్షకులను ఫిదా చేసేశారు. నాటి నుంచి కూడా బాక్సాఫీస్ దగ్గర పోటీ అంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలే ఉండేవి.

మరీ ముఖ్యంగా ఎన్నో సంక్రాంతి పండుగలకు వీరి సినిమాలు విడుదలై ఒకదాని పైన ఒకటి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ ఇద్దరి హీరోల అభిమానులు కూడా తమ హీరో గొప్ప అంటే.. తమ హీరో గొప్ప అంటూ గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ హీరోలు అంతా మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి అంటూ అభిమానులకు పిలుపునిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ నటించిన ఆ రెండు సినిమాలు తనకు ఎంతో ఇష్టం అంటూ బాలయ్య వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
ఏ ఏ సినిమాలు అంటే..
గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. చిరు నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తనకు చాలా ఇష్టమని చెప్పారు. తెలుగు సినిమా చరిత్రలో ఆ మూవీ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిందని పొగడ్తలు కురిపించారు. ఆ సినిమా కథ, మేకింగ్, విజువల్స్ తనను చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు. అలానే ఖైదీ సినిమా కూడా తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ చెప్పారు. ఆ సినిమాలో చిరంజీవి చేసిన యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్లు బాగా నచ్చుతాయని ఓపెన్ అయ్యారు.
ప్రస్తుతం బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ నిర్మించానున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ కూడా చేశారు. దీన్ని గమనిస్తే బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని.. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో సినిమా రాబోతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా బాలయ్య సినిమాకి మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
నో గ్యాప్- షూటింగ్ రెజ్యూమ్ పెళ్లి తర్వాత తొలిసారి కెమెరా ముందుకు విజయ్, రష్మిక -
రజనీకాంత్, ధనుష్లకు పొరుగున.. కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్! -
"ఐరన్ లెగ్".. అప్పుడు ఆమెలానే.. ఇప్పుడు ఈమెకి కూడా ?? -
ఒకటి ఫుల్ క్లాస్.. ఇంకోటి ఊర మాస్.. ఫుల్ జోష్ లో యంగ్ హీరో !! -
"రేప్" చేస్తామంటూ రోజూ బెదిరిస్తున్నారు..! -
"ఉస్తాద్" ఊచకోతకు సిద్ధమా.. మార్చి 19 రిలీజ్ ఫిక్స్ ! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్ -
తెలుగు సినీ పరిశ్రమలో శత్రుత్వాలు వీరి మధ్యేనా? -
బిగ్ షాక్ ఇచ్చిన మరో స్టార్ సింగర్.. ఇకపై స్టాప్ !












Click it and Unblock the Notifications