అల్లు అర్జున్ "పుష్ప 3" స్టోరీ ఇదేనా.. కలెక్షన్స్ ఊచకోత పక్కా !
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్గా మారిన పేరు ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్". 'పుష్ప' సిరీస్తో ఆయన ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ముఖ్యంగా 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ను ఊపేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. భారత సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ ఘనవిజయంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్టార్ దిశగా అడుగులు వేశాడని చెప్పవచ్చు.
'పుష్ప'తోనే కథ ముగిసిపోయిందని మొదట భావించినా.. దర్శకుడు సుకుమార్ మాత్రం అభిమానుల అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. 'పుష్ప 2' క్లైమాక్స్లోనే 'పుష్ప 3: ది ర్యాంపేజ్' అంటూ అనౌన్స్ చేసి థియేటర్లలోనే కాదు సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టించారు. ముఖ్యమైన పాత్రలను అసంపూర్తిగా వదిలేయడం, పుష్ప రాజ్ కథ ఇంకా ముగియలేదన్న సంకేతాలు ఇవ్వడంతో మూడో భాగంపై ఆసక్తి అమాంతంగా పెరిగింది.

పుష్ప 3 కథపై స్టోరీలైన్ ఇదేనా..?
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పుష్ప రాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ఎలా మరింత బలంగా నిలబెట్టుకుంటాడు, శత్రువులు, ద్రోహులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నదే 'పుష్ప 3' ప్రధాన కథాంశంగా ఉండనుందని టాక్. ఈసారి పుష్ప రాజ్ మరింత రౌద్రంగా, రాజకీయాలు, అంతర్జాతీయ మాఫియాలతో ఢీకొనే స్థాయిలో కథ సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
స్క్రిప్ట్ వర్క్ మొదలైందా?
కాగా దుబాయ్లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ వేదికగా సుకుమార్ స్వయంగా 'పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది' అని కన్ఫమ్ చేశారు. అయితే రిలీజ్ టైమ్లైన్ మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, సుకుమార్ టీమ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ ఆఫీస్ తీసుకుని 'పుష్ప: ది ర్యాంపేజ్' స్క్రిప్ట్ వర్క్, కథా చర్చలు ఇప్పటికే మొదలయ్యాయట. బన్నీ, సుక్కు తమ ప్రస్తుత ప్రాజెక్టుల గ్యాప్లో ఈ పనులు చేస్తున్నారని సమాచారం. మరోవైపు 'పుష్ప 2' జపాన్లో 'పుష్ప కున్రిన్' పేరుతో విడుదలై అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో తన 22వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నాయి. అలాగే లోకేష్ కనగరాజ్తో మరో పాన్ ఇండియా సినిమాకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే 'పుష్ప 3: ది ర్యాంపేజ్' సెట్స్పైకి వెళ్లే అవకాశముంది. అందుకే ఈ సినిమా షూటింగ్ 2027 వేసవి తర్వాతే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
-
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
రాజేంద్ర ప్రసాద్కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !!












Click it and Unblock the Notifications