Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీదేవి కెరీర్‌పై 'మచ్చ'గా మారిన సినిమా.. ఆర్జీవే కారణం?

అతిలోక సుందరి శ్రీదేవి ఎన్నో భాషలలో నటించి ప్రేక్షకులను అలరించింది. కానీ ఒక సినిమా మాత్రం ఆమె కెరీర్‌లో అత్యంత చెత్త ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్‌లో 2004లో ఒక సినిమా విడుదలైంది. ఇందులో ఆనాటి ఇద్దరు పెద్ద స్టార్లు శ్రీదేవి, అక్షయ్ కుమార్ నటించారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో, ఎప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు.ఇద్దరు పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురాలేకపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బహుశా క్లైమాక్స్ లేకుండానే థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా ఇదే కావచ్చు. ఆ సినిమానే శ్రీదేవి, అక్షయ్ కుమార్ నటించిన 'మేరీ బీవీ కా జవాబ్ నహీ'.

అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం రామ్ గోపాల్ వర్మే అని ఈ సినిమా దర్శకుడు పంకజ్ పరాశర్ ఇప్పటికీ భావిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన సినిమా 'మేరీ బీవీ కా జవాబ్ నహీ' ఫ్లాప్ అవ్వడానికి రామ్ గోపాల్ వర్మ కారణమని, అతను శ్రీదేవిని బలవంతం చేయకుంటే సినిమా అంత దారుణంగా ఉండేది కాదని పంకజ్ పరాశర్ అన్నారు. ఆర్జీవీ సలహా, పదేపదే బలవంతం చేయడం వల్లే సినిమాకు ఈ గతి పట్టిందని ఆయన పేర్కొన్నారు.

The Film That Marked a Blot in Sridevi s Career RGV s Role in Meri Biwi Ka Jawab Nahi

రామ్ గోపాల్ వర్మ వల్లే సినిమా ఫ్లాప్ అయ్యిందా?
పంకజ్ పరాశర్ ఇలా అన్నారు. "'మేరీ బీవీ కా జవాబ్ నహీ' అనే మరో సినిమా వచ్చింది. అది చాలా కాలం పాటు నిలిచిపోయింది. నేను ఎప్పుడూ చెప్పేదేమిటంటే, ప్రతి సినిమాకు ఒక జాతకం ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ సరిగ్గానే, సజావుగానే సాగుతోంది. అప్పుడే నా స్నేహితుడు రామ్ గోపాల్ వర్మ ప్రవేశించాడు. ఈ సినిమాకు జరిగిన నష్టానికి, అది ఫ్లాప్ అవ్వడానికి అతనే పూర్తి బాధ్యుడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, అతను శ్రీదేవితో నిరంతరం 'బరువు తగ్గండి, బరువు తగ్గండి, బరువు తగ్గండి' అని అంటూనే ఉన్నాడు. అతని నిరంతర ఒత్తిడి, సలహాల వల్లనే ఈ సినిమాకు ఇంతటి దారుణమైన గతి పట్టింది. అతను శ్రీదేవిని బలవంతం చేయకుంటే, సినిమా ఫలితం ఇంత భయంకరంగా ఉండేది కాదు." అని పంకజ్ పరాశర్ వ్యాఖ్యానించారు.

చాలా ఏళ్లు వాయిదా పడిన శ్రీదేవి సినిమా
ఆర్జీవ వల్లే 'మేరీ బీవీ కా జవాబ్ నహీ' సినిమా చాలా సంవత్సరాలు నిలిచిపోయిందని పరాశర్ వివరించారు. రామ్ గోపాల్ వర్మ ఒత్తిడి కారణంగా శ్రీదేవి తన బరువు తగ్గించుకోవడానికి క్రాష్ కోర్స్ డైట్‌కు వెళ్లిందని ఆయన చెప్పారు. "ఆమె క్రాష్ కోర్సులో చేరింది. అలా చేసినప్పుడు ఉప్పు మానేసింది. దీంతో బీపీ పడిపోయింది. ఆమె స్పృహ తప్పింది. ఆమె స్పృహ కోల్పోయి కిందపడి టేబుల్‌కు తగిలింది. 20 నిమిషాల పాటు స్పృహ లేకుండా ఉంది. ఆమె ఒక పన్ను విరిగింది." అని పంకజ్ పరాశర్ చెప్పుకొచ్చారు.

క్లైమాక్స్ లేకుండానే విడుదల, భారీ ఫ్లాప్!
ఇది హిట్ కావాల్సిన ప్రాజెక్ట్‌లో ఊహించని మలుపుగా మారింది. అక్షయ్ కుమార్, శ్రీదేవితో పాటు ఇద్దరు స్టార్స్ అభిమానులు ఇష్టపడే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ పదేపదే జాప్యాలు, నిధులు కోల్పోవడం, నిర్మాత మరణించడం వంటి కారణాలతో, 'మేరీ బీవీ కా జవాబ్ నహీ' ఏళ్ల తరబడి రద్దు చేయబడింది.'మేరీ బీవీ కా జవాబ్ నహీ' సినిమా చాలా సంవత్సరాలు ఆగిపోయి, చివరకు క్లైమాక్స్ లేకుండానే విడుదలైనప్పుడు ప్రేక్షకులు దానిని అసలు పట్టించుకోలేదు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇది శ్రీదేవి, అక్షయ్ కుమార్ కెరీర్‌లోని అత్యంత ఫ్లాప్ సినిమాలలో ఒకటి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+