స్టార్ హీరోను బ్యాన్ చేస్తున్న ఫిల్మ్ ఛాంబర్ ?, నిర్మాతల చర్చలు, షూటింగ్ లో ఉన్న సినిమాలు ?
హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ కావడంతో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దీనిపై పలువురి స్పందనలు నవ్వు తెప్పిస్తుంటే, మరికొన్ని ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాగే కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి చెప్పిన మాట కన్నడ ప్రజలకు నవ్వులు పూయించింది. రేణుకాస్వామి హత్యకేసులో నటుడు దర్శన్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడ, వాళ్ల గ్యాంగ్ అరెస్టు అయ్యింది.
హత్య కేసులో హీరో దర్శన్ తో పాటు నిందితుల అరెస్ట్ గురించి కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి స్పందించారు. బెళగావిలో శనివారం విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సతీష్ జారకిహోళి సమాధానమిస్తూ బెంగళూరుకు 550 కి.మీ దూరంలోని బెళగావిలో మేము ఉన్నామని అన్నారు. దీని గురించి ఏమి చెప్పాలి, దర్శన్ కేసు గురించి మాకు ఎలా తెలుస్తుంది, మీరు బెంగుళూరులో ఉన్నవాళ్లను దీని గురించి అడగండి అంటూ మంత్రి సతీష్ జారకిహోళి సమాధానం ఇవ్వడంతో అక్కడున్న వాళ్లు అందరూ నవ్వేశారు.

రేణుకాస్వామిని దర్శన్ తదితరులు చంపేశారని కేసు నమోదు అయ్యింది. రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి మృతుని కుటుంబాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ బృందం పరామర్శించింది. చిత్రదుర్గ నగరంలోని తుర్వనూర్ రోడ్డులో ఉన్న మృతుడు రేణుకాస్వామి నివాసాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేష్, ఆయన బృందం సందర్శించి మృతుని తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా దనసహాయం చేశారు.
కర్ణాటక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడితో పాటు, పదాదికారుల ముందు రేణుకాస్వామి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నా కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ విషయం మాకు తెలియజేయవచ్చు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే చంపాల్సిన అవసరం లేదని రేణుకాస్వామి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా మృతుడి తల్లిదండ్రులు, భార్యకు ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయలు అంటే మొత్తం రూ. 5 లక్షలు ఫిల్మ్ చాంబర్ పదాదికారులు దజేశారు.
కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు మేము క్షమాపణలు చెప్పామని అన్నారు. హీరో దర్శన్ని కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్మాతలతో చర్చించాలని. పోలీసులు పెట్టే ఛార్జిషీటు చూసి నిర్ణయం తీసుకోవాలని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సురేష్ మీడియాకు చెప్పారు. ఈరోజు సినిమా పరిశ్రమను కాపాడుకోవాలని,, కన్నడ చిత్ర పరిశ్రమ నేడు అంతరించిపోయే దశలో ఉందని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ పదాదికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications