చిరంజీవిపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1980-90ల్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. అగ్ర హీరోలతో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. అంతే కాకుండా ఈ జోడికి మోస్ట్ హిట్ పెయిర్గా మంచి గుర్తింపు వచ్చింది.ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయిన్టైన్ చేశారనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి. ఇక రాజకీయాల్లో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేశారు.
ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మగా కీర్తి గడించారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో పని చేశారామె. ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. విజయశాంతి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

చిరంజీవితో కలిసి పని చేయడాన్ని తాను బాగా ఎంజాయ్ చేస్తానని ఆమె తెలిపారు. అయితే సదరు యాంకర్ మాట్లాడుతూ... 80 బ్యాచ్కు చెందిన ఆర్టిస్టులంతా ప్రతి సంవత్సరం ఒక చోట కలిసి ఎంజాయ్ చేస్తుంటారు కదా మీరు ఆ పార్టీకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. దానికి విజయశాంతి సమాధానం ఇస్తూ.. నన్ను చిరంజీవి ఎప్పుడూ ఆ పార్టీలకు పిలవలేదు. ఒకవేళ పిలిచిన తాను పార్టీలకు వెళ్లనని విజయశాంతి చెప్పుకొచ్చారు.అలాంటి పార్టీలకు నేను చాలా దూరంగా ఉంటానంటూ విజయశాంతి పేర్కొన్నారు. షూటింగ్, రాజకీయాలు, ఇళ్లు అంతే తప్పితే పార్టీలకు వెళ్లను అంటూ స్పష్టం చేసింది. అందుకే ఎటువంటి పార్టీల్లో కనిపించనని విజయశాంతి తెలిపారు. విజయశాంతి ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
-
నాగ చైతన్య - రష్మిక కు అవార్డులు, దుమ్మురేపిన రాజు వెడ్స్ రాంబాయి -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్కు ‘శ్రీరామరక్ష’ -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications