జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్ర చేసుంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచేవాడు
వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 2010లో వచ్చిన అదుర్స్ సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో తారక్ నటన హైలైట్ గా నిలిచింది. బ్రహ్మానందం-తారక్ మధ్య వచ్చే ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదించారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. చారి పాత్రను మాత్రం ఇప్పటివరకు ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. అంతగా అందులో లీనమై నటించాడు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు.
అదుర్స్ సినిమాకు రచయితగా పనిచేసిన కోన వెంకట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికైనా మంచి పాయింట్ తో అదుర్స్ 2 ను తెరకెక్కిస్తామన్నారు. దీనికోసం తారక్ ను ఒప్పిస్తానన్నారు. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటిముందు ధర్నా చేసైనా ఒప్పిస్తానన్నారు. దేశంలో ఈ పాత్రను మరెవరూ చేయలేరన్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అదుర్స్ గొప్ప సినిమాగా నిలిచిపోయిందన్నారు. ఆ క్యారెక్టర్, మాడ్యులేషన్, ఆహార్యం.. అన్నీ తారక్ లా దేశంలో ఎవరూ చేయలేరని వెంకట్ వ్యాఖ్యానించారు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ట్రైలర్ విడుదల సమయంలో ఆయన దీనిపై మాట్లాడారు.

అదుర్స్ సినిమాకు సీక్వెల్ చేయాలని దర్శకుడు వినాయక్ కూడా ప్రయత్నించారుకానీ జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపలేదు. ఆ సినిమా విడుదలైన ఒకటి, రెండు సంవత్సరాల తర్వాత కథను సిద్ధం చేసివుంటే చేయడానికి ఆసక్తి చూపించేవాడేమోకానీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయి.. రోజురోజుకు క్రేజ్ పెరుగుతున్న సమయంలో ఈ తరహా కథతో సినిమా చేయడం అంటే కష్టమేనని తారక్ అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దేవర తర్వాత వార్ 2 చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. దీనికి సంబంధించిన డేట్లు కూడా కేటాయించాడు. ఏప్రిల్ నెల నుంచే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.












Click it and Unblock the Notifications