Fact Check:కాలిపోయిన కాళీమాత విగ్రహం ఫోటో వైరల్..బీజేపీ ఎంపీ ట్వీట్.. నిజమేంటి..?
పశ్చిమ బెంగాల్ : సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అవాస్తవమైన వార్తలు వేగంగా వైరల్ అవుతున్నాయి. అందులోను మతపరంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు కొందరు. దీంతో ఒక వర్గం వారిపై మరో వర్గం వారు దాడులకు దిగే పరిస్థితి వస్తోంది. ఇలాంటి వార్తలతో పెద్ద అనర్థాలే జరుగుతున్నాయి. దీనిపై డేగ కన్ను వేసి ఉంచాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు వైరల్గా మారింది. కాలిపోయిన కాళీమాత విగ్రహం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోపై ట్విటర్లో ఒక పోస్టు చేశారు బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్.
కాలిపోయినట్లుగా ఉన్న కాళీమాతా విగ్రహం ఫోటోను ట్విటర్లో పోస్టు చేస్తూ బెంగాల్లో మమతా బెనర్జీ జీహాదీ తరహా రాజకీయాలను చేస్తోందంటూ రాసుకొచ్చారు. అంతేకాదు హిందూ మతం హిందూ సాంప్రదాయాలకు పాతరేసేందుకు మమతా ప్రయత్నిస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో ఒక మతం వారు ఆలయంను ఎలా ధ్వంసం చేశారో చూడండంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కాళీమాత విగ్రహంకు నిప్పు పెట్టారంటూ ట్వీట్లో చెప్పుకొచ్చారు. సిగ్గుపడాల్సిన విషయమంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవడంతో అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.

విచారణ చేసిన అధికారులు అసలు వాస్తవం బయటపెట్టారు. ఎంపీ అర్జున్ సింగ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. అసలు ఏం జరిగిందన్న వాదనపై పోలీసులు విచారణ చేయగా కాళీమాతా ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగిందని దీంతో మంటలు చెలరేగి విగ్రహం కాలిపోయిందని ఆలయ అధికారులు చెప్పినట్లు పోలీసులు ధృవీకరించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై దీనికి ఎవరు బాధ్యులో పోలీసుల సహకారంతో విచారణ చేస్తున్నామని ఆలయ అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ చేసిన వాదనల్లో నిజం లేదని తేల్చిన పోలీసులు ఆయనకు త్వరలోనే నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇదే చెబుతూ ఎంపీ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అతనిపై లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమేరకు బెంగాల్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే పోస్టులపై చాలా జాగ్రత్తతో వ్యవహరించాలని పోలీసులు కోరారు.


Fact Check
వాదన
కాళీ మాత విగ్రహంకు ఒక వర్గం వారు నిప్పు పెట్టారు
వాస్తవం
ఘటనకు ఎలాంటి మతపరమైన అంశం ముడిపడి లేదు, అగ్ని ప్రమాదం వల్లే జరిగింది
రేటింగ్
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications