వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాదీకిఅత్యున్నత కెనడా అవార్డు
హైదరాబాద్: కృష్ణాజలాల విషయంలో తెలంగాణ కోణం రాష్ట్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్య అయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిందే జలాల పంపిణీలో ప్రాంతీయ అసమానతలు. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాలకు కీలకం కూడా జలాలే. కృష్ణానదీ జలాల పంపిణీ విషయంలో రాష్ట్రంలో అంతర్గత వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీజలాలపై కొత్త ట్రిబ్యునల్ను కోరడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. టిఆర్ఎస్ ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసింది.
Comments
Story first published: Thursday, January 10, 2002, 23:53 [IST]