వజ్రాలగని ఆంధ్రావని
ఖర్చుకు తగిన ప్రతిఫలంఉందా? కొత్త ప్రతిపాదనలేమిటి? వాటి వల్లవచ్చే ఫలితాలేమిటి? ఇప్పటి వరకు ఖర్చు అవుతున్నమొత్తాలలో ఏ మేరకు తగ్గించవచ్చు?అన్న అంశాలపై శాఖలవారిగా ప్రభుత్వం తర్జన భర్జనలు చేసి ఒకఅవగాహనకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలకథనం. ఈ కసరత్తు వల్ల రెండు వేల కోట్లరూపాయల వరకు ఆదాచేయవచ్చని ఒక అంచనా. జీరోబేస్డ్ బడ్జెట్ సాధ్యమేనా?
జీరో బేస్డ్బడ్జెట్ రూపకల్పనపై కొందరు నిపుణులకుఅనుమానాలున్నాయి. గతంలో ఆర్ధిక శాఖనునిర్వహించిన మాజీ ఐఎఎస్ అధికారి బిపిఆర్ విఠల్జీరో బేస్డ్ బడ్జెట్ పై వ్యాఖ్యానిస్తూ మొత్తంఉద్యోగులందరినీ తొలగించి మొదలు పెడితే తప్పసాధ్యం కాకపోవచ్చని అన్నారు. ఇది ఆచరణ సాధ్యంకాదని గతంలో కొన్ని అనుభవాలు చెబుతున్నాయన్నదిఆయన అభిప్రాయం. ఈ అభ్యంతరాలను ప్రభుత్వం కొట్టిపారేయనప్పటికీ వృధా వ్యయం అరికట్టడానికి ఎక్కడో ఒకచోట ప్రయత్నం జరగాలని అభిప్రాయపడుతున్నది.అశోక గజపతి రాజు ఆర్ధిక మంత్రిగా ఉన్నకాలంలో మైక్రో సర్వే ఆధారంగా ప్రజలఅవసరాలను గుర్తించడానికి మైక్రో సర్వే ఆధారంగా ప్రజలఅవసరాలను గుర్తించిబడ్జెట్ తయారుచేస్తామని చెప్పారు. ఆ సర్వే ఒకప్రహసనంగా ముగిసింది.
ఎంతో ఉపయోగకరమైనజీరో బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెడదామంటే ఆర్ధిక సంఘంసిఫార్సులు అడ్డు వస్తున్నాయని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతున్నారు. ఆర్ధిక సంఘంఅన్నాక దానికి కొన్ని మార్గ దర్శక సూత్రాలు ఉంటాయి.
అవి చేసేసిఫార్సుల వల్ల కొన్ని రాష్ట్రాలకు మేలుజరగవచ్చు, మరికొన్నిటికి నష్టం జరగవచ్చు. అంత మాత్రంచేత ఆర్ధిక సంఘం సిఫార్సులన్నిటినీ వ్యతిరేకించాలనిచంద్రబాబు నాయుడుకేంద్రంపై వత్తిడి చేయడం వెనుక దాగినలక్ష్యమేమిటో మరికొద్ది రోజుల్లో గానీ బయట పడకపోవచ్చు. ఆర్ధిక సంఘంసిఫార్సులను అంత అడ్డదిడ్డంగాకొట్టిపారేయడం వీలు కాదని కేంద్రంఇప్పటికే స్పష్టం చేసింది. తన లక్ష్యసాధన కోసంచంద్రబాబు నాయుడు మరికొందరు ముఖ్యమంత్రులనుకూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. నాణేనికిమరో వైపు కూడా ఉంటుంది కాబట్టి ఆర్ధిక సంఘంసిఫార్సుల వల్ల కొంత లాభపడే రాష్ట్రాలన్నీఒకటై ఇదే మాదిరిగా వత్తిడి చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి.
ఆర్ధిక సంఘంసిఫార్సుల వల్ల రాష్ట్రానికి 900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని,దాని ప్రభావం రాష్ట్ర బడ్జెట్ పై తీవ్రంగాఉంటుందని ప్రభుత్వ వర్గాల అంచనా. బాగా పని చేసే రాష్ట్రాలకు ఆర్ధిక సంఘంసిఫార్సులు నష్టం కలిగిస్తుండగా, పని తీరు బాగా లేని రాష్ట్రాలకుమేలు కలిగిస్తుందని ఇదిసహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని చంద్రబాబు నాయుడువాదన. దీనిపై పార్లమెంటులోప్రభుత్వాన్ని నిలదీయవలసిందిగాతెలుగుదేశం ఎంపీలను ఆయన కోరారు. ఇంతమాత్రంచేత ఆయన కేంద్రంలో ఎన్డీఎ కూటమికి మద్దతుఉపసంహరించుకుంటారని అనుకోరాదు. విద్యుత్వంటి ముఖ్య సమస్యలను పక్క దారిపట్టించడానికికేంద్రంతో ఘర్షణ ధోరణి అవలంబిస్తున్నారన్నవిమర్శలులేకపోలేదు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications