పూరీ తీరంలో ఆనంద్ చిత్రం

Varala Anand
పూరీ సముద్రతీరంలోని పింక్ హౌస్ బ్రింగ్ యువర్ ఓన్ ఫిల్మ్ ఫెస్టివలో లో కరీనగగర్ కు చెందిన వారాల ఆనంద్ చిత్రం శివ పార్వతులు (బ్రైడ్స్ ఆఫ్ లార్డ్ శివ) ప్రదర్శితమైంది. ఈ చిత్రోత్సవం ఈ నెల 25వ తేదీన ముగిసింది. వారాల ఆనంద్ రచయిత, కవి, సినీ వ్యాఖ్యాత. కరీంనగర్ లోని శ్రీ రాజరాజశ్వరి ఆలయంలోని వింత ఆచారంపై ఆనంద్ 24 నిమిషాల నిడివి గల చిత్రాన్ని నిర్మించారు.

ప్రతి శ్రీరామనవమి నాడు ఆ ఆలయంలో భక్తులు శివుడిని పెళ్లి చేసుకుంటారు. స్త్రీలే కాకుండా పురుషులు కూడా శివుడిని వివాహం చేసుకునే ఆచారం ఉంది. తలపై జీలకర్ర, బెల్లం పెట్టుకుని, నుదుట సింధూరం ధరించి, చేతిలో త్రిశూలంతో ఆ ఆచారాన్ని పాటిస్తారు. ఈ లఘు చిత్రాన్ని ఆనంద్ తెలుగులోనే తీశారు. అయితే ఆంగ్లభాషలో సబ్ టైటిల్స్ వేశారు. ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఇన్ స్క్రీన్ సంస్థ గత ఐదేళ్లుగా ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో ఆరు తెలుగు చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. వీటిలో ఆనంద్ చిత్రం ఒకటి. ఆనంద్ సినిమాలపై పలు పుస్తకాలు రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+