సెట్స్ పైకి మళ్ళీ పవన్ 'సత్యాగ్రహి'!!
అయితే ఈ చిత్రాన్ని తానే డైరక్ట్ చేయాలా లేక వేరేవారికి అప్పచెప్పాలనేదే ఇప్పుడు ఆయన్ని ఆలోచనలో పడేస్తున్న అంశం.ఆయన భార్య రేణు దేశాయ్ ని ఈ చిత్రానికి నిర్మాతగా పెట్టి అంతా తానే ముందుకు నడిపించాలనుకుంటున్నాడు.ప్రస్తుతం పవన్ తీన్ మార్ ప్రాజెక్టులోనూ,గబ్బర్ సింగ్ ప్రాజెక్టులోనూ బిజీగా ఉన్నారు.రెండూ హిందీ చిత్రాల రీమేక్ లు కావటంతో ఈ సారి తాను చేసేది రీమేక్ కాకూడదని,అందుకే సత్యాగ్రహిని భుజాన ఎత్తుకున్నాడని అంటున్నారు.
తన కిష్టమైన చేగువేరా సిద్ధాంతాలను బలపరచటం,కామన్ ఫ్రొటక్షన్ ఫోర్స్ కి సంభందించిన వివరాలను విశదీకరించి అదో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయని అంటున్నారు. అలాగే తన దర్శకత్వంలో రానున్న చిత్రం కావటం తో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా వాస్తవికతకు పెద్ద పీట వేయనున్నాడని తెలుస్తోంది. పూర్తిగా పవన్ ఆలోచనలతో రూపొందే ఈ చిత్రం మరో జానిలా కాకుండా జల్సాలా విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.