నగరంలో సందడి చేసిన కవిత-సమంత(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన సన్షైన్ ఉమెన్, చైల్డ్ సెంటర్ను శుక్రవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, సినీనటి సమంతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగావారిద్దరూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ఎంపి కవిత మాట్లాడుతూ.. వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
హైదరాబాద్ను మెడికల్, టూరిజం హబ్గా చేయనున్నట్టు ఎంపి కవిత తెలిపారు. డాక్టర్ గురువారెడ్డి ఏడాదిలో మూడు వందల మోకాళ్ల శస్త్రచికిత్సలను చేస్తూ ఉత్తమ వైద్యుడిగా ఖ్యాతి గడించారని అభినందించారు.
భవిష్యత్తులో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త వైద్య విధానాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. సినీనటి సమంతా మాట్లాడుతూ.. తన ఫౌండేషన్ ద్వారా ఐదుమందికి అరుదైన శస్త్ర చికిత్సలను చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజుల, డాక్టర్ అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సమంత
నగరంలోని మాదాపూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన సన్షైన్ ఉమెన్, చైల్డ్ సెంటర్ను శుక్రవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, సినీనటి సమంతతో కలిసి ప్రారంభించారు.
కవిత-సమంత
ఈ సందర్భంగావారిద్దరూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ఎంపి కవిత మాట్లాడుతూ.. వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
సమంత
హైదరాబాద్ను మెడికల్, టూరిజం హబ్గా చేయనున్నట్టు ఎంపి కవిత తెలిపారు.
సమంత
డాక్టర్ గురువారెడ్డి ఏడాదిలో మూడు వందల మోకాళ్ల శస్త్రచికిత్సలను చేస్తూ ఉత్తమ వైద్యుడిగా ఖ్యాతి గడించారని అభినందించారు.
కవిత-సమంత
సినీనటి సమంతా మాట్లాడుతూ.. తన ఫౌండేషన్ ద్వారా ఐదుమందికి అరుదైన శస్త్ర చికిత్సలను చేసినట్లు తెలిపారు.
కవిత-సమంత
భవిష్యత్తులో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త వైద్య విధానాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు.
కవిత-సమంత
మాదాపూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన సన్షైన్ ఉమెన్, చైల్డ్ సెంటర్ను శుక్రవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, సినీనటి సమంతతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజుల, డాక్టర్ అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.