2017లోకి మొదట, చివరగా అడుగు పెట్టేది ఎవరో తెలుసా?
డిసెంబర్ 31 అర్ధరాత్రి అందరూ 2016 సంవత్సరానికి వీడ్కోలు పలికి, 2017కు స్వాగతం పలికారు.
న్యూఢిల్లీ: డిసెంబర్ 31 అర్ధరాత్రి అందరూ 2016 సంవత్సరానికి వీడ్కోలు పలికి, 2017కు స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి అరుస్తూ, బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మనం కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం.
అయితే, ప్రపంచంలో సమోవా దేశం తొలిసారి కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టింది. అలాగే, చివరిసారిగా అడుగు పెట్టేది ఐస్లాండ్స్ ఆఫ్ అమెరికా. బేకర్స్ ఐస్ లాండ్, హోలాండ్ ఐస్ లాండులలో ఎవరూ ఉండరు. అక్కడ ఎవరైనా అడుగు పెడితే వారే చివరగా 2017లోకి అడుగు పెట్టిన వారు అవుతారు.
సమోవా దేశంతో పాటు కిరిబాటి, తోంగా తదితర దేశాలు ప్రాంతాలు తొలిసారి 2017లోకి అడుగు పెట్టాయి.
ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, చైనా, పిలిప్పీన్స్, సింగపూర్, ఇండోనేషియా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, ఇరాన్, రష్యా, గ్రీస్, జర్మనీ, యూనైటెడ్ కింగ్డమ్, బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికా, కెనెడా, అలస్కా, హవాయి, అమెరికన్ సమోవా, చివరగా.. అమెరికాలోని బేకర్స్, హోవాలాండ్ ఐస్లాండ్స్.. 2017లోకి అడుగు పెడతాయి.