చిరు చేతుల్లో ఏమీ లేదా?

కాంగ్రెసుకు ప్రజారాజ్యం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం కూడా ఆయనలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు చిరంజీవి అంగీకరించడం లేదని ఆయన అనుకుంటున్నారు. కాంగ్రెసుకు ధీటైన శక్తిగా ఎదగడానికి తగిన ప్రణాళిక లేకపోవడమే కాకుండా ఆ మేరకే ఎదిగాలనే ఉద్దేశం కూడా చిరంజీవిలో లేదని అంటున్నారు. దీంతో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటనే అభిప్రాయం బలపడింది. దీంతో దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సమాయత్తమైనట్లు చెబుతున్నారు.
తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను దేవేందర్ గౌడ్ ఖండించలేదు. దీన్ని బట్టి ఆయన తెలుగుదేశంలో చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్ ను, పెద్దిరెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకునే విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల శాసనసభ్యులతో చర్చించారు. ఆ జిల్లాల శాసనసభ్యులు వారిద్దరి రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో దేవేందర్ గౌడ్, తన సహచరుడు పెద్దిరెడ్డితో కలిసి వారం పది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. బుధవారం ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ తో జరిగిన సమావేశంలో దేవేందర్ గౌడ్ తాను పార్టీ వీడడం ఖాయమని చెప్పినట్లు తెలుస్తోంది. దేవేందర్ పార్టీని వీడరని చెప్పినప్పటికీ చిరంజీవి చేతుల్లో ఏమీ లేదని తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ పోవడం తప్ప ఆయన చేయగలిగిందేమీ కూడా లేదని అంటున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications