వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై జగన్ గోడ మీది పిల్లివాటం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వ్యవహారంపై వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఆ పార్టీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తే అవుననే అనిపిస్తోంది. వైయస్సాఆర్ పార్టీ స్థాపించిన తర్వాత మొదటి ప్లీనరీని శుక్రవారం, శనివారం నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరీలో తెలంగాణ అంశం, ఎస్సీ వర్గీకరణపై తేల్చుతాని గత కొన్నాళ్లుగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి తదితరులు చెప్పుకొస్తున్నారు. వైయస్ జగన్ పార్టీలో చేరాలని భావిస్తున్న పలువురు కాంగ్రెసు నేతలూ ప్లీనరీలో తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత వెళదామనే ఆలోచనలో ఉన్నారు.

అయితే ఎస్సీ వర్గీకరణపై ఓ నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. శుక్రవారం ప్లీనరీ ప్రాంగణంలో ఆ పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సెంటిమెంటుతో కూడుకున్నదని, తెలంగాణపై జగన్ ఈ ప్లీనరీలోనే నిర్ణయం తీసుకోవాలని ఇటు సీమాంధ్ర ప్రజలు, అటు తెలంగాణ ప్రజలు కోరుతుండవచ్చు. ఈ ప్లీనరీలోనే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పలేదు. అంతేకాదు. తెలంగాణ అంశానికి సంబందించి కాంగ్రెసు పార్టీ, యుపిఏ పూర్తి బాధ్యత వహించాలని ఆయన సూచించారు.

తెలంగాణపై జగన్ నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారం కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ తెలంగాణకు ఓకే అంటే తెలంగాణ రావడమో, కాదంటే తెలంగాణ రాకపోవడమో జరగదని అందుకే వైయస్సాఆర్ పార్టీ నిర్ణయానికి అంత ప్రాధాన్యత లేదని ఆయన చెప్పారు. అంటే ఈ ప్లీనరిలో తెలంగాణపై తాము నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పినట్లుగా కనిపిస్తోంది. పైగా, వైయస్ జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, వైయస్సార్ కాంగ్రెసులోకి రావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు పూర్తి వ్యతిరేకులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వారు పలు సందర్భాల్లో మాట్లాడిన ఉదంతాలున్నాయి. అందువల్ల తెలంగాణకు అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. అయితే, తెలంగాణపై జగన్ ఏం చెబుతారో రేపు (శనివారం) తేలుపోతుంది.

English summary
It seems, YSR Congress party president YS Jaganmohan Reddy will escape from telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X