ముగ్గురు నేతలవి మూడు దారులు

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఏదో పొడిచేస్తారని అనుకున్నారు. ఆయన ముక్కుసూటిదనం, కచ్చితత్వం పార్టీని గాడిలో పడేస్తుందని పార్టీ అధిష్టానం నమ్మకం పెట్టుకుంది. అయితే, పరిస్థితి ఏ మాత్రం దారిలోకి రాలేదు. పైగా, మరింతగా విషమించింది. తెలంగాణలోని మాదిగ నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ నినాదం కాస్తా తగ్గుముఖం పడుతుందని అనుకున్నారు. ఆయన పరిస్థితిని అదుపులోకి తెస్తారని అనుకున్నారు. కానీ, అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాలనను, పార్టీ వ్యవహారాలను గాడిలో పెడతారని ఎన్నో అశలు పెట్టుకున్న అధిష్టానం ఆశలు వమ్మయ్యాయి. దీంతో తీవ్ర నిరాశకు, అసంతృప్తికి లోనట్లవుతున్నట్లు సమాచారం.
దామోదర రాజనర్సింహను ముఖ్యమంత్రిని చేయడం వల్ల తెలంగాణ నాయకుల్లో అగ్గి మరింతగా రాజుకుంది. అధిష్టానానికి, ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మంత్రి గీతారెడ్డి ఆ పదవిని ఆశించి భంగపడిన తర్వాత తెలంగాణపై తన గొంతును పెంచారు. తన అసంతృప్తికి తెలంగాణ డిమాండును ఆలంబనగా చేసుకున్నారు. నిజానికి, తెలంగాణకు చెందిన చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు పదవులపై అసంతృప్తితో అసమ్మతి తెలంగాణ ఉద్యమ రూపంలో వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయం ఉంది.
పార్టీ వ్యవహారాలను, ప్రభుత్వ పాలనను చక్కదిద్దాల్సిన కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ మధ్య సమన్వయం కూడా లోపించింది. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ అప్పుడప్పుడు మీడియా ముందు గళం విప్పుతున్నా దామోదర రాజనర్సింహ మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. మొత్తం మీద, రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.












Click it and Unblock the Notifications