జగన్వైపు ఎమ్మెల్యేలు: కౌంటర్ స్కెచ్చేసిన బాబు

అయితే పార్టీని వీడేందుకే విమర్శలు చేస్తున్న వారిని మాత్రం చంద్రబాబు ఏమాత్రం ఉపేక్షించడం లేదని చెబుతున్నారు. వారంతట వారే పార్టీని విడిచి వెళ్లేందుకు బాబు స్కెచ్ వేస్తున్నారట. విమర్శలు చేస్తే వేటు వేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన బాబు వారి దారిలోనే కౌంటర్ స్కెచ్ వేస్తున్నారట. వెళ్లాలనుకునే వారు ప్రధానంగా బాబునే టార్గెట్ చేసుకుంటున్నారు. అలాంటి వారిపై వేటు వేయకుండా వారంతట వారే పార్టీని వీడేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట.
ఇటీవల తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలు తెలంగాణపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాసినందుకు నిప్పులు చెరిగారు. బాబు వల్లనే టిడిపి ఇలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారు తెలంగాణపై బాబు లేఖ రాసినందుకు విమర్శలు చేయలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం దానిని ఉపయోగించుకొని వారు బాబును టార్గెట్ చేశారు. వారు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు మానసికంగా ఎప్పుడో సిద్ధమయ్యారు.
కానీ పార్టీ మారడానికి వారికి సందర్భం రాలేదు. చంద్రబాబు తెలంగాణపై లేఖ రాయగానే వారు దానిని ఉపయోగించుకొని బాబుపై విమర్శలు గుప్పించారు. వారు ఘాటు వ్యాఖ్యలే చేశారు. కానీ టిడిపి వెంటనే వారిపై స్పందించలేదు. జగన్ను, ఆయన కుటుంబాన్ని స్వయంగా కలిసిన సంకినేని వెంకటేశ్వర రావు, మైసూరా రెడ్డిలపై వెంటనే వేటు వేశారు. కానీ ప్రవీణ్, అమర్నాథ్లు పార్టీని వీడకుండా, వైయస్సార్ కాంగ్రెసును కలవకుండా వేటు వేయించుకొని వెళితే మరింత లబ్ధి ఉంటుందని భావిస్తున్నారట.
ఇది గుర్తించిన చంద్రబాబు వారిపై వేటు వేయకుండా టిడిపి వైపు ప్రజలు మరింత మొగ్గు చూపేలా వారిపై వెంటనే వేటు వేయకుండా వ్యూహాత్మకంగా వ్యహరించారని చెబుతున్నారు. వేటు వేస్తే సానుభూతి పెరుగుతుంది, వారంతట వారే వెళితే టిడిపికి ఆయా నియోజకవర్గాల్లో లాభం ఉంటుందని ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. అందుకే బాబు వారంతట వారే బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications