వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ ఎమ్మెల్యేలకు కర్ణాటక మాజీ స్పీకర్ సలహాలు?
దాంతో కాంగ్రెసు శాసనసభా పక్షం తాజా విప్ కాపీని అందజేసింది. ఈ పరిణామంతో కాపు రామచంద్రా రెడ్డి తనకు మళ్లీ నోటీసు ఇవ్వాలని స్పీకర్ను కోరారు. అదే విధంగా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అయోమయం కలిగించే పద్ధతిలో వ్యవహరించారు. తనకు ప్రజారాజ్యం జారీ చేసిన విప్ వర్తించదని ఆమె మొదట వాదించారు. ఆ తర్వాత ఆమె రాజీనామా చేశారు. తాజాగా ఆమె అనర్హత నోటీసుకు వివరంగా సమాధానం ఇచ్చారు. అనుభవం గల నిపుణుల సలహా మేరకే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో స్పీకర్ మనోహర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు.
తన ముందు హాజరు కావాలని జగన్ వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులను స్పీకర్ ఆదేశించారు. వారికి 18 నుంచి 21 మధ్య తేదీలను ఇచ్చారు. వారు స్పీకర్ ముందు హాజరై ఏం చెప్తారనేది వేచి చూడాల్సిందే.
Comments
English summary
The pro-Jagan Congress MLAs are reportedly being advised by a former speaker of Karnataka because of which the office of Nadendla Manohar wants to be extra careful in dealing with the disqualification notices, sources said.
Story first published: Friday, January 6, 2012, 10:57 [IST]