విభజన: 25ఏళ్ల శ్రమ వృధా అవుతుందన్న సిఎం

Kiran Kumar Reddy
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజన జరిగితే నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలను ప్రస్తావించిన కిరణ్... తెలంగాణ ఇస్తే నక్సల్స్ ముప్పు పొంచి ఉందని సుదీర్ఘ వివరణ ఇచ్చారట. విభజన జరిగితే మళ్లీ మావోయిస్టులు పెట్రేగి పోతారని చెప్పారట.

విభజనతో మావోలు తిరిగి విజృంభిస్తే, పాత పరిస్థితులు పునరావృతం అవుతాయని కిరణ్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం, విశాఖపట్నం జిల్లాల్లో నాలుగైదు సరిహద్దుల్లో ఇప్పటికి యుద్ధ వాతావరణం ఉంటోందని, ఒకప్పుడు నక్సలిజానికి కంచుకోటల్లాంటి ప్రాంతాలున్న ఆంధ్రప్రదేశ్‌లో వారిని నియంత్రించడానికి రాష్ట్రం అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుందని, పాతికేళ్ల సమయం పట్టిందని ప్రస్తావించారట.

విభజన జరిగితే పాత పరిస్థితులు వస్తాయని, మావోయిస్టు ఉద్యమంలో జాతీయ స్థాయి నుంచి జోనల్ కమిటీల వరకు కీలకమైన నాయకత్వ శ్రేణిలో అత్యధుకులు ఎపికి చెందిన వారేనని, ప్రత్యేకించి తెలంగాణకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారట. రాష్ట్రంలో గత నలభై ఏళ్లకు పైగా జరిగిన మావోల హింసాత్మక సంఘటనలు ఆయన అధిష్టానం ముందు లెక్కలతో సహా వివరించారట.

ఒకప్పుడు యాభై నియోజకవర్గాల పరిధిలో మావోల ప్రభావం ఉండేదని, రాజకీయ నాయకులు రక్షణ కోసం జిల్లా కేంద్రాలకు, రాజధానికి వచ్చే వారని, మావోల దాడిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు మృతి చెందారని, అలాంటి నక్సలిజాన్ని నియంత్రించేందుకు ఇరవై అయిదేళ్లు పట్టిందని, విభజన జరిగితే మళ్లీ మావోయిస్టులు బలవంతులవుతారని, ఇన్నేళ్ల శ్రమ వృధా అవుతుందని చెప్పారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+