ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్తరంనియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 లో కాంగ్రెస్ ను ఎమ్ విజయప్రసాద్..ప్రజారాజ్యం నుండి పివిజిఆర్ నాయుడు పోటీ పడ్డా రు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది విజయప్రసాద్ 4144 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ టిడిపి నుండి పోటీ చేసిన మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు భార్య నాగమణి మూడో స్థానంలో నిలిచారు. గణబాబు మాజీ ఎమ్మెల్యే. ఈయన తం డ్రి అప్పలనరసింహం కూడా గతంలో ఎమ్మెల్యేగా ..ఎంపిగా పని చేసారు.
2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 226721 ఓట్లు ఉంటే, అందులో 134404 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన గణబాబుకు 76791 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన దాడి రత్నాకర్ కు 45934 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది గణ బాబు 30857 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు.













Click it and Unblock the Notifications