బాబు, వైఎస్ మధ్య 'అవగాహన'?

YS Rajasekhar Reddy
"సాక్షి"కి, "ఈనాడు"కి మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్టు లేదు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ రాజశేఖరరెడ్డి సొంత పత్రిక తెలుగుదేశం ప్రముఖ నాయకుల జాతకాలను బయటపెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. చవకగా కలర్ ఫుల్ పత్రిక ఇచ్చినంత మాత్రాన పబ్లిక్ లో ప్రభావం ఉండదన్న విషయాన్ని "సాక్షి" యాజమాన్యం ఆలస్యంగా గ్రహించి సాధ్యమైనంత వరకు ఎగ్రెసివ్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. జోగయ్య వార్త ద్వారా చిరంజీవి పార్టీని, ఈటీవీ సుమన్ వార్త ద్వారా రామోజీరావును తద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీశామన్న సంతృప్తి "సాక్షి" యాజమాన్యంలో కనిపిస్తోంది.

రోజుకి కోటో, అరకోటో నష్టం వస్తున్న పత్రికను పోషించడం దీర్ఘకాలంలో కష్టమే. కనీసం ఎన్నికల వరకు పత్రికను లాగాలంటే ఇంకా కొందరు ప్రత్యర్ధి నాయకులను బజారుకు ఈడ్వక తప్పదు. ఈ పత్రిక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ జాబితాలో చంద్రబాబు నాయుడి అత్యంత సన్నిహితులు ఉంటారు. వీళ్ళు చంద్రబాబు నాయుడి మీద నేరుగా ఎందుకు పడరంటే అందుకు కారణాలు వేరే ఉన్నాయి. ఒక వేళ చంద్రబాబు నాయుడు వైఎస్ ఆస్ధుల పూర్తి వివరాలు బయటపెట్టగలిగితే, వైఎస్ కూడా చంద్రబాబు నాయుడి ఆస్ధుల చిట్టా బయట పెట్టగలరు. తమిళ నాడు రాజకీయాల తరహాలో ఇక్కడెందుకు నిజాలు ప్రత్యర్ధుల నోటి నుంచి బయటికి రావడం లేదు. ఒకరు అధికారంలోకి వస్తే మరోకరిని జైలుకు పంపే పరిస్ధితులు ఎందుకు రావడం లేదు? ప్రజలకు నిజాలు తెలుసుకునే అవకాశం ఎందుకు రావడం లేదు? బాబు, వైఎస్ దొందూ దొందే అయితే? వారిద్దరి మధ్య రహస్య అవగాహన ఉంటే? జనం ఫూల్సే కదా?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+