వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూకుడు ధోరణిలో మళ్ళీ కెసిఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడనివ్వరని అప్పుడు తెలుసుకున్న కెసీఅర్ నిదానంగా వ్యవహరించారు. వైయస్ మరణించిన తర్వాత ఆయన ప్రత్యేక తెలంగాణ విషయంలో దూకుడుగా వెళ్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేసుకుంటున్న ఆంధ్రా వారిని రెచ్చగొట్టేవిధంగా ఆయన మాట్లాడుతున్నారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చిన లక్షలాది మంది ఆంధ్రా జనాన్ని ఆయన వ్యూహాత్మకంగా వెనకేసుకు వచ్చారు. ఆంధ్రాకు చెందిన అతి కొద్ది మంది పెద్దల మీదనే ఆయన మాటల దాడి చేశారు. ఈ పెద్దల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కెసిఆర్ ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాశారు.

మేధావులమని చెప్పుకునే కొందరు స్వార్థపరుల చర్యల వల్ల తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన సామాన్య ఆంధ్రా ప్రాంత వాసులు నష్టపోతారని ఆయన అన్నారు. ఇలాంటి స్వార్థపరులు కుట్రపూరిత చర్యల వల్ల ఆంధ్రాప్రాంతానికి చెందిన సామాన్యులు ఆక్రమించుకున్న భూములు, ఉద్యోగాలు వదులుకొని పోవాల్సి వస్తుందని కెసిఆర్‌ హెచ్చరించారు. లగడపాటి రాజగోపాల్‌ పై కేసీఆర్‌ మండి పడ్డారు. అనవసరంగా స్థానికులకు, స్థానికేతరులకు పుల్లలు పెడుతూ రాజగోపాల్‌ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. తాను తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఎన్ని శక్తులొచ్చినా ఆపలేవని, తాను ఒక సారి బలిపీఠమెక్కితే ఉత్పాతమేనని కేసీఆర్‌ హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X