వైఎస్ వేదాంత ధోరణి

రాజకీయ నాయకులు అరవై ఏళ్ళకు రిటైరైతే బాగుంటుందని, తన మటుకు తాను అదే చేయబోతున్నానని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ ప్రకటించారు. ఇప్పుడాయనకు దాదాపు అరవై ఏళ్ళు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాక ఆయనలో ప్రజల పట్ల బాధ్యత బాగా పెరిగింది. ఇంకా మరికొన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అందువల్లనే కావచ్చు ఆయన గతంలో చేసిన రిటైర్మెంట్ ప్రకటనను మర్చిపోయారు. ఆయన లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేనట్టే అన్న పరిస్ధితి ఉండడం వల్ల కూడా ఆయన కన్నతల్లి వంటి పార్టీ సేవ కోసం రిటైర్మెంట్ ప్రతిపాదనను విరమించుకున్నారని అనుకోవాలి. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతే మరి.












Click it and Unblock the Notifications